News

ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం

280views

ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు సరిచేయడంపై దృష్టిపెట్టిన యోగి గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం 50 వేల మంది క్రిమినల్స్‌కు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. గూండా యాక్ట్ కూడా తీసుకొచ్చారు. 2017 మార్చ్ 20 నుంచి ఇప్పటివరకూ 23 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. క్రిమినల్స్‌ను వేటాడే క్రమంలో 4911 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 1424 మంది పోలీసులున్నారు.