డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం
1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన...
