భారత సంతతే లక్ష్యంగా దక్షిణాఫ్రికాలో దాడులు – ఆస్తులు, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయుధాలు పడుతున్న భారతీయులు
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అల్లర్లలో భారత సంతతి ప్రజలే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఇళ్లు, వ్యాపార సంస్థలను దోచుకోవటంతో పాటు, తమపై దాడులకు పాల్పడుతున్నారని భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలను అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతూ...
