
జైనమతంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది. జైనులు కూడా శ్లేఖ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం పాటిస్తారు. ముంబైలోని జైన కుటుంబానికి చెందిన ఓ బాలిక సరిగ్గా 110 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 16 ఏళ్ల అమ్మాయి 3 నెలల 20 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠినమైన ఉపవాసం చేసింది. ముంబైలోని కండివాలిలో గుజరాతీ కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలిక మూడు నెలల 20 రోజుల పాటు ఆహారం లేకుండా 110 రోజుల ఉపవాసాన్ని పూర్తి చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కొందరు సాధువులు, సాధ్వీలు ఇలా తపస్సు చేస్తుంటారు. కానీ, 16ఏళ్ల యువతి ఇంత కాలం ఉపవాసం ఉండడం పెద్ద విషయమేనంటూ జైన గురువులు కొనియాడారు. జూలై 11న 16 రోజుల ఉపవాస దీక్షతో క్రిషా ఇంత సుదీర్ఘ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఉపవాసం ప్రారంభించడానికి అనుమతి కోసం క్రిషా తన గురువైన ముని పద్మకలశ మహారాజును సంప్రదించారు. ఆమె ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే కాచిన నీళ్లు తాగేది. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకపోవడంతో ఈ నిరాహార దీక్షను జూలై 10 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
క్రిషా తండ్రి జిగర్ షా స్టాక్ బ్రోకర్ కాగా, ఆమె తల్లి గృహిణి. ఈ ఉపవాసానికి ముందు క్రిషా తొమ్మిదేళ్ల వయసులో ఎనిమిది రోజులు ఉపవాసం ఉండేదని షా కుటుంబం తెలిపింది. 3 నెలల 20 రోజుల పాటు సాగిన ఈ ఉపవాస దీక్ష శనివారంతో ముగిసింది. బాలిక క్రిషా ఇన్ని రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఆమెకు, షా పరివార్కు ప్రత్యేక గౌరవం.




