
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న జవారి టెంపుల్లో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం పై వేసిన పిల్ పై వాదనలు జరిగిన విషయం తెలిసిందే.. రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ విషయంపై కోర్టులో పిటీషన్ వేశారు. మొఘల్ రాజుల కాలంలో డ్యామేజ్ అయిన విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే సీజేఐ గవాయ్ ఆ పిల్పై స్పందిస్తూ వివాదాస్పద వ్యాక్యలు చేశారు… ఇది నిజమైన పిల్ అని, ఏదైనా చేయమని వెళ్లి ఆ దేవుడినే అడుగు అని, విష్ణుభగవానుడికి వీర భక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా, అయితే పూజలు, ప్రార్థనలు చేయమని సీజేఐ అన్నారు.ఒకవేళ నువ్వు శైవానికి వ్యతిరేకం కాదనుకుంటే, ఖజురహో ఆలయ సమూహంలోనే పెద్ద శివలింగం ఉన్నదని, అక్కడకి వెళ్లి పూజలు చేయాలని పిటీషనర్ను సీజేఐ గవాయ్ కోరారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజేఐ వ్యాఖ్యలు హిందవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కూడా గవాయ్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించింది.
న్యాయస్థానం న్యాయ మందిరం లాంటిది. భారతీయ సమాజం తన న్యాయస్థానాలపై అపారమైన విశ్వాసాన్ని ఉంచుతుంది. ఈ నమ్మకాన్ని బలోపేతం చేయడం మన సమిష్టి కర్తవ్యం. కానీ ప్రధాన న్యాయమూర్తి ఒక భక్తుడి విశ్వాసాన్ని ఎగతాళి చేసినప్పుడు, అది ఆ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాఖ్య అనవసరమైనది, బాధ కలిగించేది, నివారించదగినది.” అని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ న్యాయవాదులు , న్యాయవాదులు కోర్టు లోపల సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, న్యాయమూర్తులు కూడా అదే బాధ్యతను నిర్వర్తించాలని అలోక్ కుమార్ అన్నారు, “ముఖ్యంగా విశ్వాస విషయాలలో, కోర్టులు సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. పవిత్రమైన మూర్తిని పునరుద్ధరించాలని కోరుకునే భక్తుడు గౌరవానికి అర్హుడు, ఎగతాళికి కాదు. ఇటువంటి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి.” అని వారు అన్నారు. మసీదు లేదా దర్గా పునరుద్ధరణ కోరుతున్న ముస్లిం పిటిషనర్ను “అల్లాహ్ను వెళ్లి దానిని పునర్నిర్మించమని అడగండి” అని చెప్పగలరా? అంటూ హిందుత్వ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కోర్టులు హిందువులకు వ్యతిరేకంగా, ఇతర మతాల విషయానికి వస్తే కోర్టులు హిందూ విశ్వాసాలలో పదేపదే జోక్యం చేసుకున్నాయని, పునర్నిర్వచించాయని లేదా పూర్తిగా తోసిపుచ్చాయని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ తీరుచాలా బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేస్తున్నాయి.





