
ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గం రెడ్ సీ కారిడార్ లో ఇటీవల సముద్రపు దొంగలు (పైరేట్లు) రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలపై దాడులు చేసి, వాటిని హైజాక్ చేస్తుండడంతో ఈ నౌకా మార్గం కాస్తా ప్రమాదకరంగా మారింది. ఈ రూట్ లో ప్రయాణించాలంటే నౌక సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సరుకు రవాణాకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ రెడ్ సీ కారిడార్ లో అరేబియా సముద్రంలో ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. హైజాక్ గురైన షిప్ లను విడిపించడం, నౌకా సిబ్బందిని రక్షించడంతో పాటు పైరేట్ల ఆటకట్టించేందుకు సిద్ధమైంది.
ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గం రెడ్ సీ కారిడార్ లో ఇటీవల సముద్రపు దొంగలు (పైరేట్లు) రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలపై దాడులు చేసి, వాటిని హైజాక్ చేస్తుండడంతో ఈ నౌకా మార్గం కాస్తా ప్రమాదకరంగా మారింది. ఈ రూట్ లో ప్రయాణించాలంటే నౌక సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సరుకు రవాణాకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ రెడ్ సీ కారిడార్ లో అరేబియా సముద్రంలో ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. హైజాక్ గురైన షిప్ లను విడిపించడం, నౌకా సిబ్బందిని రక్షించడంతో పాటు పైరేట్ల ఆటకట్టించేందుకు సిద్ధమైంది.
ఎంవీ రూయెన్ షిప్ను ఎలా రక్షించారంటే..
2023 డిసెంబర్ 14న మాల్టా దేశానికి చెందిన కార్గో షిప్ రూయెన్ ను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అరేబియా సముద్రంలో ఈ షిప్ ను పైరేట్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో నౌక సిబ్బంది ఎమర్జెన్సీ సందేశం పంపారు. ఈ మెసేజ్ అందుకున్న భారత నేవీ వెంటనే రంగంలోకి దిగింది. రూయెన్ నౌకను కాపాడేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. హైజాక్ గురైన ఎంవీ రూయెన్ నౌకను ట్రేస్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరేబియా, ఎర్ర సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు మార్చి 14న ఎంవీ రూయెన్ నౌకను సోమాలియా తీరం వైపు వెళుతున్నట్లు గుర్తించి, ఐఎన్ఎస్ కోల్ కతా నౌకను అటుగా మళ్లించినట్లు భారత నేవీ అధికారులు తెలిపారు.
#IndianNavy has responded to the manifestation of Israel – Hamas conflict in the maritime domain by re-orienting & significantly enhancing the scope of its ongoing #maritimesecurityoperations since mid-Dec 23. The navy undertook proactive actions during the hijacking of Malta… pic.twitter.com/r5dNiW6PN4
— SpokespersonNavy (@indiannavy) March 23, 2024
ఐఎన్ఎస్ కోల్ కతా షిప్ తో ఎంవీ రూయెన్ నౌకను అడ్డగించి, నేవీ విమానంలో సోల్జర్లను పంపించామన్నారు. అక్కడి నుంచి క్షణం కూడా వృధా చేయకుండా ఓవైపు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే నేవీ సిబ్బందికి ఆపరేషన్ వివరాలు చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. విమానంలో ప్రయాణిస్తూ రూయెన్ షిప్ ను విడిపించే ప్లాన్ ను సోల్జర్లు చర్చించుకున్నారు. ఆపై పారాచూట్ ల సాయంతో ఐఎన్ఎస్ కోల్ కతా షిప్ పై ల్యాండయ్యారు. అందులో నుంచి హెలీకాప్టర్ ద్వారా హైజాకర్ల చెరలో ఉన్న ఎంవీ రూయోన్ పై ల్యాండయ్యారు.. షిప్ లోపల బంధీలుగా ఉన్న సిబ్బందిని విడిపించి, పైరేట్లను బంధించారు. వారిని ఐఎన్ఎస్ కోల్ కతాలోకి షిఫ్ట్ చేసి ముంబైకి తరలించారు.




