అయోధ్య రామాలయ అర్చకుల డ్రెస్ కోడులో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి నుంచి వారు కొత్త వేష ధారణలో కనిపిస్తారు. సంప్రదాయంగా ఇప్పుడు ధరిస్తున్న కుంకుమ కలర్ వస్త్రాల స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా, కుర్తా మరియు ధోతీలను ట్రస్ట్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇక నుంచి గర్భగుడిలోకి స్మార్ట్ ఫోన్లను కూడా అర్చకులు తీసుకెళ్లకూడదని నిషేధం విధించింది. అలాగే మరి కొన్ని అంశాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అర్చకుల వేష ధారణలో ఏకరూపత (యూనిఫాం) సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే.. ఎంత మంది మధ్యలో వున్నా… ఎక్కడ వున్నా… అర్చకులను ఇట్టే పసిగట్టగలగడం వీలవుతుందని, అందుకే డ్రెస్ కోడ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకునితో పాటు 20 మంది అర్చకులు, ట్రైనీ అర్చకులకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటి వరకు కొందరు కుంకుమ కలర్ వస్త్రాలు, మరి కొందరు పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. ఇప్పటి నుంచి కొత్త డ్రెస్ కోడ్లతో కనిపించనున్నారు.
433views
You Might Also Like
పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను మరింత అభివృద్ధి చేయాలి
బెంగళూరు : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు రెండు రోజుల పాటు పెర్మా కల్చర్ సదస్సును నిర్వహించారు. ఆహారంలో రసాయన అవశేషాలు పెరిగిపోవడం, క్షీణించిపోతున్న నేల...
బీజింగ్లో భరతనాట్యంతో మంత్రముగ్ధులను చేసిన చైనా కవలలు
బీజింగ్: చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్ యాన్షు, జిన్ యానై భరతనాట్య ప్రదర్శనతో బీజింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ 16 ఏళ్ల...
ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం- అసోం యూనివర్సిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
2
దేశీయ పశు జాతుల పరిరక్షణలో అస్సోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన...
ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్రోడ్డు – రూ.13 కోట్లతో అంచనాలు
7
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం,...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు
7
తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. భక్తులు నిర్ధారణ...
అజ్ఞాత వీరులు – ‘రా’ అధికారులు
9
భారతదేశాన్ని రక్షిస్తున్నవారు ఎవరు? ఈ ప్రశ్నకు మనలో చాలామంది వెంటనే మన సైనికులు, పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు అని సమాధానం చెబుతారు. సరిహద్దుల్లో నిలబడి శత్రువులను...




