రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డా. పి.వి.బి సంజీవ రావు తదితర నగర ప్రముఖులు రాజమహేంద్రవరం ఆనంద గార్డెన్స్ వద్ద కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .
286views
You Might Also Like
యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
2
ఉత్తర్ప్రదేశ్లో గోవుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానిత గో స్మగ్లర్లు తీవ్రంగా...
అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు
4
అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది....
కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు
11
జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన...
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..
6
పాఠశాల యూనిఫామ్తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది....
భూమిపై తొలి జీవం భారత్లోనే పుట్టిందా?
34
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
31
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్లోని సిక్కు సమాజం పాకిస్తాన్పై పోరాటం...





