<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Mon, 10 Aug 2026 10:36:03 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.9</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>నేపాల్ లో ముహర్రం జెండాల వివాదం: పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు మృతి</title>
		<link>https://vskandhra.org/91592/</link>
					<comments>https://vskandhra.org/91592/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 12:00:48 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91592</guid>

					<description><![CDATA[<p>కప్తాన్‌గంజ్ (నేపాల్): నేపాల్-భారత్ సరిహద్దులోని సున్సరీ జిల్లా కప్తాన్‌గంజ్ గ్రామంలో ముహర్రం వేడుకల అనంతరం నాటిన జెండాలను తొలగించకపోవడం తీవ్ర వివాదానికి, తద్వారా రక్తాపాతానికి దారితీసింది. స్థానిక శివాలయ ప్రాంగణంలో ముస్లిం వర్గం నాటిన జెండాలను వేడుకలు ముగిసినా పీకేయకపోవడమే ఈ ఘర్షణలకు ప్రధాన మూలకారణంగా మారింది. ఈ వివాదం ముదిరి చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివాదానికి మూలకారణం: స్థానిక ఆధారాల ప్రకారం, జూన్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91592/">నేపాల్ లో ముహర్రం జెండాల వివాదం: పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు మృతి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>కప్తాన్‌గంజ్ (నేపాల్): నేపాల్-భారత్ సరిహద్దులోని సున్సరీ జిల్లా కప్తాన్‌గంజ్ గ్రామంలో ముహర్రం వేడుకల అనంతరం నాటిన జెండాలను తొలగించకపోవడం తీవ్ర వివాదానికి, తద్వారా రక్తాపాతానికి దారితీసింది. స్థానిక శివాలయ ప్రాంగణంలో ముస్లిం వర్గం నాటిన జెండాలను వేడుకలు ముగిసినా పీకేయకపోవడమే ఈ ఘర్షణలకు ప్రధాన మూలకారణంగా మారింది. ఈ వివాదం ముదిరి చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.</p>
<p><strong>వివాదానికి మూలకారణం:</strong><br />
స్థానిక ఆధారాల ప్రకారం, జూన్ 28న నయా హటియా బజార్‌లోని శివాలయం వద్ద ముహర్రం నిర్వహణ కోసం ముస్లిం వర్గం స్థానిక యంత్రాంగం నుండి అనుమతి పొందింది. ఆ సమయంలో అక్కడ 40కి పైగా మతపరమైన జెండాలను నాటారు. పండుగ ముగిసిన తర్వాత కూడా ఆ జెండాలను తొలగించకుండా అక్కడే వదిలేశారు. ఆ తర్వాత పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో, శివాలయ సమీపంలో ఉన్న ఆ జెండాలను తొలగించాలని స్థానిక హిందువులు వార్డు కార్యాలయానికి, నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ జెండాలను పీకేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది.</p>
<p><strong>ఘర్షణ &#8211; ముగ్గురు హిందూ యువకుల మృతి:</strong><br />
జెండాలను తొలగించకపోవడంతో ఆగ్రహం చెందిన స్థానిక యువకులు జులై 26న వాటిని పీకేసి, హనుమాన్ జెండాలను ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి &#8216;బొల్ బామ్&#8217; యాత్రకు సిద్ధమవుతున్న యువకులు మైక్‌సెట్ల ద్వారా పాటలు వేయడంతో ఇరు వర్గాల మధ్య పుకార్లు వ్యాపించి మాటమాట పెరిగింది. రాత్రి వేళ తోపులాట జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో జరిగిన ఘర్షణ, వారు జరిపిన కాల్పుల్లో ఓం ప్రకాష్ మెహతా (31), జై ప్రకాష్ మెహతా (21), గణేష్ యాదవ్ (15) అనే ముగ్గురు హిందూ యువకులు మరణించారు.</p>
<p>సకాలంలో ఆ జెండాలను తొలగించి ఉంటే లేదా అధికారులు ముందే స్పందించి ఉంటే ఈ రాద్దాంతం జరిగి ఉండేది కాదని, ముగ్గురు యువకుల ప్రాణాలు దక్కేవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91592/">నేపాల్ లో ముహర్రం జెండాల వివాదం: పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు మృతి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91592/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ఉత్సాహంగా 2కే రన్</title>
		<link>https://vskandhra.org/91589/</link>
					<comments>https://vskandhra.org/91589/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 11:30:34 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91589</guid>

					<description><![CDATA[<p>దుండిగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దుండిగల్‌లో నిర్వహించిన 2కే రన్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమైంది. దుండిగల్‌లోని ఐఏఆర్ఈ (IARE) కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ పరుగు గండిమైసమ్మ సర్కిల్ వరకు సాగింది. సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, యువశక్తిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్‌లో వందలాది మంది యువకులు, విద్యార్థులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91589/">ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ఉత్సాహంగా 2కే రన్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>దుండిగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దుండిగల్‌లో నిర్వహించిన 2కే రన్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమైంది. దుండిగల్‌లోని ఐఏఆర్ఈ (IARE) కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ పరుగు గండిమైసమ్మ సర్కిల్ వరకు సాగింది. సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, యువశక్తిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.</p>
<p>ఈ రన్‌లో వందలాది మంది యువకులు, విద్యార్థులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు మరియు దుండిగల్ పోలీసు యంత్రాంగం ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ పొడవునా యువత ఆవేశపూరిత నినాదాలతో పరిసరాలను ఉత్తేజపరిచారు.</p>
<p><strong>మత్తు రహిత సమాజం &#8211; నేటి అత్యంత ఆవశ్యకత:</strong><br />
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుండిగల్ సీఐ రాంబాబు గారు మాట్లాడుతూ, యువత తమ అమూల్యమైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి చేయవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మరియు ఇతర చెడు అలవాట్లు వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాకుండా, కుటుంబాలను, చివరకు సమాజ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణంలో యువతే వెన్నెముక అని, డ్రగ్-ఫ్రీ సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు. దుండిగల్ పోలీసు టీమ్ కూడా ఈ పరుగులో పాల్గొని యువతకు అవగాహన కల్పిస్తూ అండగా నిలిచింది.</p>
<p><strong>దేశ ప్రగతిలో యువత పాత్రే కీలకం:</strong><br />
ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచారక్ సందీప్ జీ మాట్లాడుతూ, సంఘ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ వికాసానికి యువశక్తిని సరైన మార్గంలో మళ్లించడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. &#8220;నశాముక్త్ భారత్ — శ్రేష్ట భారత్&#8221; అనే లక్ష్యం కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. దు అలవాట్లకు దూరంగా ఉంటూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకున్నప్పుడే యువత దేశ ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించగలరని ఆకాంక్షించారు.<br />
ఈ అవగాహన 2కే రన్ స్థానిక ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, యువతలో నూతన ఉత్సాహాన్ని, సామాజిక స్పృహను నింపింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు, పోలీసు అధికారులు మరియు కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91589/">ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ఉత్సాహంగా 2కే రన్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91589/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరం :  భాగవత్</title>
		<link>https://vskandhra.org/91641/</link>
					<comments>https://vskandhra.org/91641/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 11:00:49 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91641</guid>

					<description><![CDATA[<p>విదర్భ : దేశవ్యాప్తంగా సంచార మరియు డీనోటిఫైడ్ (ఘుమంతు-విముక్త) తెగలుగా పిలువబడే ఈ వర్గాలు ఒకప్పుడు జ్ఞానాన్ని పంచిపెట్టే సమాజాలుగా ఉండేవి. సమాజంతో తమ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవడానికి ఈ వర్గం దేశమంతటా సంచరించేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలనలో, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు గాను మొత్తం పార్ధీ-ఆదివాసీ సమాజాన్ని &#8216;నేరస్తుల తెగ&#8217;గా ముద్ర వేశారు. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91641/">భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరం :  భాగవత్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>
విదర్భ : దేశవ్యాప్తంగా సంచార మరియు డీనోటిఫైడ్ (ఘుమంతు-విముక్త) తెగలుగా పిలువబడే ఈ వర్గాలు ఒకప్పుడు జ్ఞానాన్ని పంచిపెట్టే సమాజాలుగా ఉండేవి. సమాజంతో తమ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవడానికి ఈ వర్గం దేశమంతటా సంచరించేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>బ్రిటిష్ పాలనలో, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు గాను మొత్తం పార్ధీ-ఆదివాసీ సమాజాన్ని &#8216;నేరస్తుల తెగ&#8217;గా ముద్ర వేశారు. ఇది ఆ సమాజ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.ఆగస్టు 8 న విదర్భలోని ఓ పాఠశాలలో పార్ధీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు.</p>
<p>సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు అమనోరా YES ఫౌండేషన్ చొరవతో పార్ధీ పిల్లల కోసం అత్యాధునిక పాఠశాల నడుస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయం. దేశం నిజంగా &#8216;విశ్వగురువు&#8217;గా ఎదగాలంటే, సమాజంలో వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం అత్యవసరమని ఆయన అన్నారు.</p>
<p>ఖమ్‌గావ్‌లోని శ్రీ సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్ధీ-ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో, పూణేకు చెందిన &#8216;అమనోరా యెస్ ఫౌండేషన్&#8217; (Amanora YES Foundation) చొరవతో నిర్మించిన మూడు అత్యాధునిక క్రీడా సముదాయాలతో సహా పలు సౌకర్యాలను సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు.</p>
<p>కార్యక్రమ ప్రారంభంలో, &#8216;అమనోరా YES ఫౌండేషన్&#8217; సహకారంతో ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సరసంఘచాలక్ పరిశీలించారు. పాఠశాలలోని అత్యాధునిక క్రీడా మైదానాలు, విద్యార్థులకు భోజనం సిద్ధం చేసే వంటగది, విద్యార్థులు స్వయంగా పెంచిన కూరగాయల తోట మరియు వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు.</p>
<p>ఒకప్పుడు భారతీయ సమాజం అత్యంత వ్యవస్థీకృతంగా ఉండేదని, విదేశీ దాడుల కారణంగా సమాజం క్రమంగా బానిసత్వంలోకి నెట్టబడి, కాలక్రమేణా ముక్కలైపోయింది. దీనివల్ల సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ, ఆ వర్గాలు ఎప్పుడూ బానిసత్వాన్ని అంగీకరించలేదని తేల్చి చెప్పారు.</p>
<p>ఘుమంతో తెగల వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగించారు. బ్రిటిష్ పాలనలో, పార్ధి మరియు ఆదివాసీ వర్గాలను &#8216;నేరస్తులు&#8217;గా ప్రకటించారు. ఇది వారి అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించింది. సంఘ్ అనేక సంవత్సరాలుగా పార్ధి వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.అమనోరా యెస్ ఫౌండేషన్ ఈ పాఠశాలను మార్చి, దాని విద్యార్థులను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. ఈ పని నిస్సందేహంగా ప్రశంసనీయం. అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరమని భాగవత్ నొక్కి చెప్పారు.</p>
<p>ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అశోక్ ఉయికే, కార్మిక శాఖ మంత్రి ఆకాష్ ఫుండ్కర్, ఇండోర్‌కు చెందిన శ్రీ సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ ఆయుషి దేశ్‌ముఖ్ మరియు సిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిరుద్ధ దేశ్‌పాండే కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91641/">భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరం :  భాగవత్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91641/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>షేక్ హసీనా మీడియా సమావేశంతో తమకు సంబంధం లేదన్న భారత్</title>
		<link>https://vskandhra.org/91583/</link>
					<comments>https://vskandhra.org/91583/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 10:30:03 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91583</guid>

					<description><![CDATA[<p>బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంతో తమకు ఎటువంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ కార్యక్రమంలో, ముఖ్యంగా ఢాకాలోని ప్రస్తుత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించబోమని భారత్ తేల్చిచెప్పింది. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ విషయాలను వెల్లడించారు. బుధవారం జరిగిన సదరు కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, ఇందులో భారత [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91583/">షేక్ హసీనా మీడియా సమావేశంతో తమకు సంబంధం లేదన్న భారత్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంతో తమకు ఎటువంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ కార్యక్రమంలో, ముఖ్యంగా ఢాకాలోని ప్రస్తుత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించబోమని భారత్ తేల్చిచెప్పింది.</p>
<p>న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ విషయాలను వెల్లడించారు. బుధవారం జరిగిన సదరు కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. &#8220;బంగ్లాదేశ్‌లో చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మేము ఏమాత్రం సమర్థించం&#8221; అని జైస్వాల్ పేర్కొన్నారు.</p>
<p>బుధవారం న్యూఢిల్లీ నుంచి ఆడియో లింక్ ద్వారా నిర్వహించిన సమావేశంలో షేక్ హసీనా ప్రసంగించారు. బంగ్లాదేశ్‌లో గత రెండేళ్లుగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, ప్రజలు భయం, అభద్రత, ఆర్థిక ఇబ్బందుల మధ్య జీవిస్తున్నారని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రిగ్గింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిందని విమర్శించిన ఆమె, ఈ ఏడాది చివరి నాటికి తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వెళతానని తెలిపారు.</p>
<p>షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. పొరుగు దేశాల్లోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. </p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91583/">షేక్ హసీనా మీడియా సమావేశంతో తమకు సంబంధం లేదన్న భారత్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91583/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ప్రతి ఇంటా మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలి</title>
		<link>https://vskandhra.org/91330/</link>
					<comments>https://vskandhra.org/91330/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 10:00:51 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91330</guid>

					<description><![CDATA[<p>విజయవాడ: మిద్దె తోటల ద్వారా ఆరోగ్యకరమైన హరిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబాలకు తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)-విజయవాడ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91330/">ప్రతి ఇంటా మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>విజయవాడ: మిద్దె తోటల ద్వారా ఆరోగ్యకరమైన హరిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబాలకు తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.</p>
<p>సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)-విజయవాడ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 450 మందికి పైగా సభ్యులు, గార్డెనింగ్ ఔత్సాహికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.</p>
<p>ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ చేపడుతున్న హరిత కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతి ఇంట్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసి సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించడం ద్వారా కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని చెప్పారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి పెంచితే ప్రకృతి పట్ల బాధ్యతతో కూడిన భావనతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని అన్నారు. హరిత సమాజ నిర్మాణంలో సీటీజీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.</p>
<p>కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వ్యర్థ వస్తువులతో రూపొందించిన కళాకృతులను కలెక్టర్ పరిశీలించి, వాటిని రూపొందించిన హసీనాను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలు, కళాశాలల్లో రీసైక్లింగ్ ఆధారిత సృజనాత్మక పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించాలని సూచించారు.</p>
<p>ఈ సందర్భంగా వయోవృద్ధ గార్డెనర్లు, సీటీజీ సభ్యులు బలిజేపల్లి వేణుగోపాలరావు–వరలక్ష్మి దంపతులు, పగడాల సుభాష్‌బాబు–ముత్యాల ఈశ్వరి దంపతులు, అబ్బూరి వెంకటేశ్వరరావు–విజయలక్ష్మి దంపతులు, యువ గార్డెనర్ కె. శ్రీనివాస్ తదితరులను సత్కరించారు.</p>
<p>కార్యక్రమంలో సీటీజీ అడ్మిన్లు పీవీడీ నాగేశ్వరరావు, షేక్ అఫ్జల్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91330/">ప్రతి ఇంటా మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91330/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>SDPI జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు ఆరు నెలల జైలు శిక్ష</title>
		<link>https://vskandhra.org/91569/</link>
					<comments>https://vskandhra.org/91569/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 09:30:05 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91569</guid>

					<description><![CDATA[<p>(కర్ణాటక)– సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు ₹10,000 జరిమానా విధించింది. జూలై 2015లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు, రెండు వర్గాల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఉపేక్షించలేమని తన తీర్పులో స్పష్టం చేసింది. గోవధపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు జూలై 2015లో పాపులర్ ఫ్రంట్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91569/">SDPI జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు ఆరు నెలల జైలు శిక్ష</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>(కర్ణాటక)– సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు ₹10,000 జరిమానా విధించింది. జూలై 2015లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు, రెండు వర్గాల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఉపేక్షించలేమని తన తీర్పులో స్పష్టం చేసింది.</p>
<p><strong>గోవధపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు</strong><br />
జూలై 2015లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో రియాజ్ ఫరంగిపేట చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు ఆగకపోతే PFI కార్యకర్తలు బహిరంగంగా గోవులను వధించి గోమాంసాన్ని విక్రయిస్తారని ఆయన ప్రకటించారు. రాబోయే బక్రీద్ సందర్భంగా బెల్తంగడి బస్ స్టాండ్ ఎదుట గోమాంసాన్ని విక్రయిస్తామని, దానిని అడ్డుకునే వారిని తమ కార్యకర్తలు ఎదుర్కొంటారని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది.</p>
<p><strong>రియాజ్ ఫరంగిపేటపై గతంలో నమోదైన వివాదాలు</strong></p>
<p><strong>1. SDPIలో కీలక నాయకుడు</strong><br />
రియాజ్ ఫరంగిపేట కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చురుకుగా వ్యవహరిస్తూ, SDPI జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. SDPI, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో సంబంధాలున్న పార్టీగా రాజకీయ ప్రత్యర్థులు మరియు వివిధ సంస్థలు ఆరోపణలు చేస్తుంటాయి.</p>
<p><strong>2. CAA–NRC నిరసనల సందర్భంగా కేసులు</strong><br />
డిసెంబర్ 2019లో మంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర రిజిస్టర్ (NRC)కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో దేశద్రోహం సహా వివిధ నేరాల కింద రియాజ్ ఫరంగిపేట మరియు మరో SDPI నాయకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.</p>
<p><strong>3. NIA సోదాలు</strong><br />
సెప్టెంబర్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటన సందర్భంగా భద్రతా ముప్పుకు సంబంధించిన కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మంగళూరులోని రియాజ్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో ఆయనను అధికారులు విచారించగా, కొన్ని పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p><strong>4. పాకిస్థాన్ అనుకూల నినాదాల వివాదం</strong><br />
జనవరి 2021లో దక్షిణ కన్నడ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో SDPI కార్యకర్తలు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కేసులో అరెస్టైన కార్యకర్తలకు రియాజ్ మద్దతు ప్రకటించడంతో పాటు, వారిని విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని పోలీసులను హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి.</p>
<p><strong>5. ఓటర్ల జాబితాపై తప్పుడు సమాచారం ప్రచారం చేసిన ఆరోపణ</strong><br />
జూలై 18, 2026న SDPI అధికారిక &#8216;X&#8217; ఖాతాలో ప్రచురితమైన వీడియోలో, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి రియాజ్ ఫరంగిపేట తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.</p>
<p>రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి, సామరస్యానికి ముప్పు కలిగిస్తాయని, అలాంటి చర్యలపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోర్టు తన తీర్పులో పేర్కొంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91569/">SDPI జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు ఆరు నెలల జైలు శిక్ష</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91569/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>మదర్సాలలో &#8216;వందేమాతరం&#8217;లోని ఆరు చరణాలనూ పాడితే ఆకాశం ఊడిపడదు! : కలకత్తా హైకోర్టు</title>
		<link>https://vskandhra.org/91566/</link>
					<comments>https://vskandhra.org/91566/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 09:00:43 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91566</guid>

					<description><![CDATA[<p>కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) – మదర్సాలలో జాతీయ గీతం &#8216;వందేమాతరం&#8217;లోని ఆరు చరణాలను పాడడం వల్ల ఎటువంటి అనర్థం జరగదని కలకత్తా హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. మదర్సాలలో ఉదయపు ప్రార్థన సమయంలో &#8216;వందేమాతరం&#8217;ను తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు ఇంకా తుది తీర్పును వెలువరించలేదు. ఇరుపక్షాల వాదనలు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91566/">మదర్సాలలో &#8216;వందేమాతరం&#8217;లోని ఆరు చరణాలనూ పాడితే ఆకాశం ఊడిపడదు! : కలకత్తా హైకోర్టు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) – మదర్సాలలో జాతీయ గీతం &#8216;వందేమాతరం&#8217;లోని ఆరు చరణాలను పాడడం వల్ల ఎటువంటి అనర్థం జరగదని కలకత్తా హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. మదర్సాలలో ఉదయపు ప్రార్థన సమయంలో &#8216;వందేమాతరం&#8217;ను తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు ఇంకా తుది తీర్పును వెలువరించలేదు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం నిర్ణయం ప్రకటించనుంది.</p>
<p><strong>&#8216;వందేమాతరం&#8217;పై అభ్యంతరం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదన</strong><br />
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ఈ ఉత్తర్వు మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, సమానత్వం వంటి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని వాదించారు. మైనారిటీ విద్యాసంస్థలపై ఇటువంటి నిబంధన విధించడం సరికాదని పేర్కొంటూ, ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేయాలని కోరారు.</p>
<p><strong>&#8216;వందేమాతరం&#8217; జాతీయ సమైక్యతకు ప్రతీక! – రాష్ట్ర ప్రభుత్వ వాదన</strong><br />
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులు, &#8216;వందేమాతరం&#8217; భారతదేశ జాతీయ గీతం అని, దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో దానిని ఆలపించడం అవసరమని తెలిపారు. ఈ ఉత్తర్వు ఏ ఒక్క మతం లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జారీ చేయలేదని, అర్హత కలిగిన అన్ని విద్యాసంస్థలకు సమానంగా వర్తిస్తుందని కోర్టుకు వివరించారు.</p>
<p>ఈ వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం కలకత్తా హైకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం కోర్టు చేసిన వ్యాఖ్యలు విచారణ సందర్భంగా చేసిన మౌఖిక పరిశీలన మాత్రమే; ఇవి తుది తీర్పుగా పరిగణించబడవు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91566/">మదర్సాలలో &#8216;వందేమాతరం&#8217;లోని ఆరు చరణాలనూ పాడితే ఆకాశం ఊడిపడదు! : కలకత్తా హైకోర్టు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91566/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆగస్టు 14న విశాఖలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు</title>
		<link>https://vskandhra.org/91611/</link>
					<comments>https://vskandhra.org/91611/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 08:30:29 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91611</guid>

					<description><![CDATA[<p>విశాఖపట్నం: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో సుమారు వెయ్యి మంది మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీలు, ఆధ్యాత్మికవేత్తలు, ఉపాసకుల కోసం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91611/">ఆగస్టు 14న విశాఖలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>విశాఖపట్నం: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.</p>
<p>సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో సుమారు వెయ్యి మంది మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీలు, ఆధ్యాత్మికవేత్తలు, ఉపాసకుల కోసం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.</p>
<p>ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, సీహెచ్‌ వంశీకృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.</p>
<p>కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ విశాఖ సిబ్బందితో పాటు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ చీఫ్‌ డైరెక్టర్‌ సునీత కొటారి, సభ్యులు మానేపల్లి లక్ష్మి, పలివెల విజయ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>వివరాలకు సంప్రదించండి</p>
<p>సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9247784017, 8500641729 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని విశాఖ క్లస్టర్‌ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91611/">ఆగస్టు 14న విశాఖలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91611/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>మన స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలో గౌరవం: &#8216;ఇండియా డే&#8217;గా మసాచుసెట్స్ గవర్నర్ ప్రకటన</title>
		<link>https://vskandhra.org/91580/</link>
					<comments>https://vskandhra.org/91580/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 07:30:25 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91580</guid>

					<description><![CDATA[<p>అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని అధికారికంగా &#8216;ఇండియా డే&#8217;గా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో భారతీయ అమెరికన్ సమాజం అందిస్తున్న విశేష సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత 79వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని, మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 1న ఈ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కింబర్లీ డ్రిస్కాల్, సెక్రటరీ ఆఫ్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91580/">మన స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలో గౌరవం: &#8216;ఇండియా డే&#8217;గా మసాచుసెట్స్ గవర్నర్ ప్రకటన</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని అధికారికంగా &#8216;ఇండియా డే&#8217;గా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో భారతీయ అమెరికన్ సమాజం అందిస్తున్న విశేష సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.</p>
<p>భారత 79వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని, మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 1న ఈ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కింబర్లీ డ్రిస్కాల్, సెక్రటరీ ఆఫ్ కామన్వెల్త్ విలియం ఫ్రాన్సిస్ గాల్విన్ సైతం ఈ ప్రకటనను ఆమోదించారు. ఈ విశిష్ట సందర్భాన్ని మసాచుసెట్స్ రాష్ట్ర పౌరులందరూ గుర్తించి, వేడుకల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.</p>
<p>ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.6 కోట్లకు పైగా ప్రవాస భారతీయులు ఉండగా, వారిలో దాదాపు 50 లక్షల మంది అమెరికాలోనే నివసిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా మసాచుసెట్స్‌ రాష్ట్రంలో వైద్యం, సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, ప్రజా సేవ వంటి రంగాల్లో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం ప్రశంసించింది. వారి భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమయ్యాయని కొనియాడింది.</p>
<p>ఇదే స్ఫూర్తితో, బోస్టన్ నగర మేయర్ మిచెల్ వు కూడా ఆగస్టు 15ను &#8216;ఇండియా డే&#8217;గా ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.  </p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91580/">మన స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలో గౌరవం: &#8216;ఇండియా డే&#8217;గా మసాచుసెట్స్ గవర్నర్ ప్రకటన</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91580/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ధర్మం, జ్ఞానం, క్షమకు ప్రతిరూపం వశిష్ట మహర్షి</title>
		<link>https://vskandhra.org/91572/</link>
					<comments>https://vskandhra.org/91572/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 10 Aug 2026 07:00:33 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=91572</guid>

					<description><![CDATA[<p>సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షుల స్థానం అత్యంత గౌరవప్రదమైనది. వేద జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ధర్మ బోధనల ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేసిన మహర్షులలో వశిష్ట మహర్షి ప్రముఖులు. ఆయన జీవితం కేవలం ఒక ఋషి జీవిత కథ మాత్రమే కాదు; ధర్మం, సహనం, జ్ఞానం, కర్తవ్య నిష్ఠ వంటి శాశ్వత విలువలకు ప్రతీక. వశిష్ట మహర్షి సప్తర్షులలో ఒకరు. వేద జ్ఞానంలో ఆయనకు అత్యున్నత స్థానం ఉంది. సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం ఆయన ఇక్ష్వాకు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91572/">ధర్మం, జ్ఞానం, క్షమకు ప్రతిరూపం వశిష్ట మహర్షి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షుల స్థానం అత్యంత గౌరవప్రదమైనది. వేద జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ధర్మ బోధనల ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేసిన మహర్షులలో వశిష్ట మహర్షి ప్రముఖులు. ఆయన జీవితం కేవలం ఒక ఋషి జీవిత కథ మాత్రమే కాదు; ధర్మం, సహనం, జ్ఞానం, కర్తవ్య నిష్ఠ వంటి శాశ్వత విలువలకు ప్రతీక.</p>
<p>వశిష్ట మహర్షి సప్తర్షులలో ఒకరు. వేద జ్ఞానంలో ఆయనకు అత్యున్నత స్థానం ఉంది. సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం ఆయన ఇక్ష్వాకు వంశానికి రాజగురువుగా వ్యవహరించారు. అయోధ్య రాజవంశానికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా, ముఖ్యంగా శ్రీరామునికి గురువుగా వశిష్ట మహర్షి ప్రసిద్ధి చెందారు.</p>
<p>రామాయణంలో వశిష్ట మహర్షి పాత్ర ఎంతో విశిష్టమైనది. రాజులకు ధర్మ మార్గాన్ని చూపిస్తూ, ప్రజల సంక్షేమం కోసం పాలన ఎలా ఉండాలో ఆయన బోధించారు. రాజులు శక్తి, సంపద కలిగి ఉన్నప్పటికీ ధర్మం లేకపోతే వారి పాలనకు విలువ ఉండదని ఆయన తెలియజేశారు.</p>
<p>వశిష్ట మహర్షి జీవితంలోని ప్రధాన సందేశం ధర్మాన్ని అనుసరించడం. ధర్మ మార్గంలో నడిచే వ్యక్తికి నిజమైన శాంతి, సంతోషం లభిస్తాయని ఆయన బోధించారు. కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహించడం, సత్యాన్ని పాటించడం, న్యాయంగా వ్యవహరించడం ప్రతి మనిషి బాధ్యత అని ఆయన జీవితం తెలియజేస్తుంది.</p>
<p>వశిష్ట మహర్షి క్షమ, సహనానికి ప్రతిరూపంగా నిలిచారు. ఎన్నో పరీక్షలు ఎదురైనా ఆయన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. కోపాన్ని నియంత్రించుకుని, వివేకంతో సమస్యలను పరిష్కరించడం ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కష్టకాలంలో కూడా మన విలువలను కాపాడుకోవాలని ఆయన సందేశం ఇస్తుంది.</p>
<p>గురువుగా వశిష్ట మహర్షి సనాతన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందారు. గురువు కేవలం విద్యను మాత్రమే కాకుండా, జీవన విధానాన్ని, నైతిక విలువలను, ఆత్మజ్ఞాన మార్గాన్ని చూపిస్తారని ఆయన బోధనలు తెలియజేస్తాయి. శ్రీరాముడికి ధర్మం, రాజనీతి, కర్తవ్య భావాలను బోధించిన మహనీయుడిగా ఆయన చిరస్మరణీయులు.</p>
<p>వశిష్ట మహర్షి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. బాహ్య సంపద కంటే అంతరంగ శాంతి, ఆత్మజ్ఞానం గొప్పవని ఆయన సందేశం. కోరికలను నియంత్రించుకుని, సత్యం, ధర్మం, ఆత్మపరిశీలన మార్గంలో జీవించాలని ఆయన సూచించారు.</p>
<p>నేటి సమాజంలో కూడా వశిష్ట మహర్షి బోధనలు ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయి. ధర్మాన్ని పాటించడం, కష్టాల్లో సహనాన్ని కోల్పోకపోవడం, జ్ఞానం మరియు వినయాన్ని కలిగి ఉండటం, అధికారాన్ని బాధ్యతగా ఉపయోగించడం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయి.</p>
<p>వశిష్ట మహర్షి జీవితం సనాతన ధర్మంలోని ఉన్నత ఆదర్శాలకు ప్రతిబింబం. ఆయన జ్ఞానం, ధర్మ నిష్ఠ, క్షమా గుణం, గురుత్వం యుగయుగాల పాటు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ధర్మ మార్గంలో నడిచే వ్యక్తికి జ్ఞానం, శాంతి, గౌరవం సహజంగా లభిస్తాయని వశిష్ట మహర్షి జీవితం మనకు తెలియజేస్తుంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/91572/">ధర్మం, జ్ఞానం, క్షమకు ప్రతిరూపం వశిష్ట మహర్షి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/91572/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
