<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Mon, 20 Jul 2026 10:19:54 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.8</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..</title>
		<link>https://vskandhra.org/90633/</link>
					<comments>https://vskandhra.org/90633/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Tue, 21 Jul 2026 05:00:09 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90633</guid>

					<description><![CDATA[<p>భోపాల్: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. “రాష్ట్రంలో ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికే చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకే దేశం, [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90633/">మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భోపాల్: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.</p>
<p>“రాష్ట్రంలో ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికే చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉన్నప్పుడు వివిధ వర్గాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. అందరికీ సమానమైన చట్టం ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.</p>
<p>“రాముడు ఒకే వివాహం చేసుకున్నప్పుడు.. రహీమ్‌కు రెండు, మూడు, నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి? ముస్లిం మహిళలు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత యూసీసీ చట్టం ప్రకారం ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికే రాష్ట్రంలో చట్టపరమైన గుర్తింపు ఉంటుంది” అని మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు.</p>
<p>ప్రస్తుత చట్టాల ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్‌కు అవకాశం లేదని సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తలాక్ చెప్పే విధానాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భోపాల్‌లోని జగదీష్‌పూర్‌లో జరగనున్న తదుపరి క్యాబినెట్ సమావేశంలో యూసీసీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90633/">మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90633/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి</title>
		<link>https://vskandhra.org/90622/</link>
					<comments>https://vskandhra.org/90622/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Tue, 21 Jul 2026 04:30:40 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90622</guid>

					<description><![CDATA[<p>ఉదయ్‌పూర్:భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ వైద్యం మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరించే సమగ్ర వైద్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లోని హరిదాస్‌జీ కి మగ్రిలో సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వైద్య ఆరోగ్య కేంద్రం మరియు సంస్థ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జీవన విధానం, వాతావరణం, ఆహారపు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90622/">భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ఉదయ్‌పూర్:భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ వైద్యం మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరించే సమగ్ర వైద్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లోని హరిదాస్‌జీ కి మగ్రిలో సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వైద్య ఆరోగ్య కేంద్రం మరియు సంస్థ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జీవన విధానం, వాతావరణం, ఆహారపు అలవాట్లు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన ప్రకృతి వైద్య విధానం ప్రజల ఆరోగ్యానికి మరింత అనుకూలమని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి అనుగుణంగా ఆరోగ్య సేవలను అందించే సంస్థలు ఏర్పడాల్సిన అవసరం ఉందని సూచించారు.</p>
<p><strong>మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యం</strong><br />
ఆరోగ్యకరమైన శరీరం ఎంత ముఖ్యమో, అంతకంటే ఆరోగ్యకరమైన మనస్సు మరింత ముఖ్యమని భయ్యాజీ జోషి అన్నారు. మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల భవిష్యత్తు ఆరోగ్య విధానాల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.</p>
<p><strong>ప్రతి దేశానికి ప్రత్యేక ఆరోగ్య విధానం అవసరం</strong><br />
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి ఒకే సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాల ఆరోగ్య అవసరాలను సమర్థవంతంగా తీర్చలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార విధానం, వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అందువల్ల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య సంస్థలు, విధానాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.</p>
<p><strong>అన్ని వైద్య విధానాల సమన్వయం అవసరం</strong><br />
గీతా ప్రెస్ గోరఖ్‌పూర్ ప్రచురించే &#8216;కల్యాణ్&#8217; పత్రికను ప్రస్తావిస్తూ, భారతదేశంలో సుమారు 150 రకాల వైద్య విధానాలు అమలులో ఉన్నాయని భయ్యాజీ జోషి తెలిపారు. ఏ ఒక్క వైద్య విధానం అన్ని రకాల వ్యాధులకు పూర్తి పరిష్కారం కాదని, అందువల్ల వివిధ వైద్య విధానాల సానుకూల అంశాలను సమన్వయం చేసి సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 10 శాతం మందికే సూపర్-స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సాధారణ ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవలు లభించేలా ప్రభుత్వ, ప్రైవేటు మరియు సేవా సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.</p>
<p><strong>సేవాభారతి సేవలు సమాజానికి ఆదర్శం</strong><br />
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా మాట్లాడుతూ, యోగా శరీరానికి, మనస్సుకు సానుకూల శక్తిని అందిస్తుందని అన్నారు. సేవా భారతి ఎలాంటి ప్రచార ఆశ లేకుండా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.మానవాళికి సేవ చేయడమే భగవంతునికి సేవ చేసినట్లేనని పేర్కొన్న ఆయన, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, కుటుంబ విలువల పరిరక్షణ, అవసరంలో ఉన్నవారికి సేవ, కుల వివక్షకు అతీతమైన సమాజ నిర్మాణం ద్వారా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.</p>
<p>సేవా భారతి ప్రారంభించిన ఈ ప్రకృతి వైద్య ఆరోగ్య కేంద్రంలో యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఆక్యుప్రెషర్, స్పైనల్ బాత్స్ (వెన్నెముక స్నానాలు), ఫిజియోథెరపీ** తదితర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి.</p>
<p>కార్యక్రమంలో పసిఫిక్ మెడికల్ కాలేజ్ చైర్మన్ రాహుల్ అగర్వాల్, ధరోహర్ ఛారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ సంజయ్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సావినాలోని బాల సంస్కార్ కేంద్రానికి చెందిన బాలికలు దేశభక్తి గీతాన్ని ఆలపించగా, సేవా భారతి చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90622/">భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90622/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.</title>
		<link>https://vskandhra.org/90509/</link>
					<comments>https://vskandhra.org/90509/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 11:30:45 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90509</guid>

					<description><![CDATA[<p>భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు భారత్ వచ్చినప్పుడల్లా డ్రగ్స్ తీసుకువచ్చే వారని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. దీంట్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పారు. ఏఎన్ఐ పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ సంచనల [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90509/">డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు భారత్ వచ్చినప్పుడల్లా డ్రగ్స్ తీసుకువచ్చే వారని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. దీంట్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పారు.</p>
<p>ఏఎన్ఐ పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ సంచనల విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చెందడంలో డ్రగ్స్ అక్రమ రవాణా ప్రముఖంగా ఉందని, ఉగ్రవాదానికి 30 శాతం నిధులు డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు. అక్తర్, ఆసిఫ్ డ్రగ్స్ తీసుకువచ్చనట్లు పాకిస్తానీ హైకమిషనర్ వద్ద అంగీకరించినట్లు నివేదిక ఉన్నట్లు మణి చెప్పారు.</p>
<p>పాకిస్తాన్ క్రికెట్ కోచ్ బాబ్ వూల్మర్ మార్చి 18, 2007లో మరణించిన విసయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయిన మరుసటి రోజు, ఆయన తన హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన మరణించారు. డ్రగ్స్, ఉగ్రవాదం మధ్య సంబంధాన్ని చెబుతూ.. జలాలాబాద్‌లో నల్ల మందు ఎక్కువగా పండితే , భారత్‌లో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతాయని తాము అనుకుంటామని చెప్పారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90509/">డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90509/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు</title>
		<link>https://vskandhra.org/90600/</link>
					<comments>https://vskandhra.org/90600/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 11:00:48 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90600</guid>

					<description><![CDATA[<p>పాలక్కాడ్ (కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన &#8216;పంచ్ పరివర్తన్&#8217; ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రనగర్‌లోని పార్వతి కల్యాణ మండపంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంఘిక్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శంకరాచార్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికత [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90600/">ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<div id="pastingspan1"><strong>పాలక్కాడ్ (కేరళ): </strong>ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన &#8216;పంచ్ పరివర్తన్&#8217; ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రనగర్‌లోని పార్వతి కల్యాణ మండపంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంఘిక్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.</div>
<div id="pastingspan1"></div>
<div id="pastingspan1">ఈ సందర్భంగా శంకరాచార్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు. టెక్నాలజీని సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల మేలు కోసమే ఉపయోగించాలని సూచించారు. సాంకేతిక పురోగతికి ఉన్న సరళత, నిబద్ధత, వేగం వంటి లక్షణాలను సమాజ వికాసానికి ఉపయోగపడేలా మలచుకోవాలని కోరారు.</div>
<div id="pastingspan1"></div>
<div id="pastingspan1">కేరళను &#8220;పవిత్రమైన తంత్ర భూమి&#8221;గా అభివర్ణించిన స్వామీజీ.. ఇతరుల కుట్రలకు ఈ పుణ్యభూమి బలి కాకుండా ప్రజలు కాపాడుకోవాలని హెచ్చరించారు. మన కర్తవ్యానికి నాలుగు ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయని.. అవి ధర్మాన్ని చదవడం, దాని అర్థాన్ని గ్రహించడం, ఆచరించడం మరియు ప్రచారం చేయడమని తెలిపారు. అయితే, ప్రస్తుత రోజుల్లో ధర్మాన్ని అర్థం చేసుకోవడం, ఆచరించడం కంటే.. ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా సంస్కృత భాషను, భారతీయ సంస్కృతిని రక్షించి, పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తి, దేశభక్తి రెండూ ముఖ్యమైనవే అయినప్పటికీ.. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ, సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్ఘాటించారు.</div>
<div></div>
<div id="pastingspan1"></div>
<div id="pastingspan1">ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంచీ శంకరాచార్యులకు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం.. ఆయన గురువుగారైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సైతం వడక్కంతరలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంఘిక్ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.</div>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90600/">ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90600/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం</title>
		<link>https://vskandhra.org/90646/</link>
					<comments>https://vskandhra.org/90646/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 10:30:12 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90646</guid>

					<description><![CDATA[<p>హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం (జూలై 19, 2026) హైదరాబాద్‌లోని మెహదీపట్నం పుల్లారెడ్డి స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక సామరస్య వాతావరణంలో నిర్వహించడం, వివిధ కమిటీల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90646/">భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం (జూలై 19, 2026) హైదరాబాద్‌లోని మెహదీపట్నం పుల్లారెడ్డి స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు.</p>
<p> రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక సామరస్య వాతావరణంలో నిర్వహించడం, వివిధ కమిటీల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.</p>
<p>తెలంగాణలోని వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు హాజరై తమ ప్రాంతాల్లో చేపట్టనున్న ఉత్సవాల ఏర్పాట్లు, అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కార్యాచరణపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. </p>
<p><img decoding="async" fetchpriority="high" src="https://vskandhra.org/wp-content/uploads/2026/07/Screenshot-2026-07-20-154722.png" alt="" width="626" height="925" class="aligncenter size-full wp-image-90648" srcset="https://vskandhra.org/wp-content/uploads/2026/07/Screenshot-2026-07-20-154722.png 626w, https://vskandhra.org/wp-content/uploads/2026/07/Screenshot-2026-07-20-154722-203x300.png 203w" sizes="(max-width: 626px) 100vw, 626px" /></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90646/">భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90646/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>గుజరాత్‌లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలున్న ఐదుగురు అరెస్ట్</title>
		<link>https://vskandhra.org/90597/</link>
					<comments>https://vskandhra.org/90597/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 10:00:44 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90597</guid>

					<description><![CDATA[<p>&#160; గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఏటీఎస్ అరెస్టు చేసింది. సిధ్‌పూర్ తాలూకాలోని ఖడియాల్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్‌పురి అలియాస్ ఖాలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముఫ్తీ, మొహమ్మద్ హసన్ కర్డియాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన అరెస్టైన మరో ఎనిమిది మంది అనుమానితుల విచారణలో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90597/">గుజరాత్‌లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలున్న ఐదుగురు అరెస్ట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;</p>
<p>గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఏటీఎస్ అరెస్టు చేసింది.</p>
<p>సిధ్‌పూర్ తాలూకాలోని ఖడియాల్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్‌పురి అలియాస్ ఖాలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముఫ్తీ, మొహమ్మద్ హసన్ కర్డియాలను అదుపులోకి తీసుకున్నారు.</p>
<p>ఈ నెల 3వ తేదీన అరెస్టైన మరో ఎనిమిది మంది అనుమానితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఈ అరెస్టులు జరిగినట్లు ఏటీఎస్ తెలిపింది.</p>
<p>నిందితుల్లో ఒకరు టైమ్ బాంబు తయారు చేయడానికి ప్రయత్నించినట్లు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది పి.ఆర్. దంతాని తెలిపారు. నిందితుల వద్ద నుంచి బాంబు తయారీకి సంబంధించిన సామగ్రితో పాటు ఉర్దూ భాషలో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల తయారీ సామగ్రి, జిహాదీ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏటీఎస్ దర్యాప్తు కొనసాగిస్తోంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90597/">గుజరాత్‌లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలున్న ఐదుగురు అరెస్ట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90597/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహావిష్కరణ</title>
		<link>https://vskandhra.org/90613/</link>
					<comments>https://vskandhra.org/90613/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 09:30:04 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90613</guid>

					<description><![CDATA[<p>శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. శివాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో భారతీయ సంస్కృతి ప్రచారకర్త కమలనంద భారతీ స్వామీజీ, శివసాయిబాబా, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ సుస్థిర పాలన, దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90613/">హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహావిష్కరణ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. శివాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p>
<p>అనంతరం జరిగిన సభలో భారతీయ సంస్కృతి ప్రచారకర్త కమలనంద భారతీ స్వామీజీ, శివసాయిబాబా, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ సుస్థిర పాలన, దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, ప్రజాసేవకు ఆదర్శప్రాయుడని వారు పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా అదనపు ఎస్పీ మహేష్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90613/">హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహావిష్కరణ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90613/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>అమరనాథ్ యాత్రలో అద్భుతంగా  వ్యర్థాల నిర్వహణ</title>
		<link>https://vskandhra.org/90353/</link>
					<comments>https://vskandhra.org/90353/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 09:00:02 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90353</guid>

					<description><![CDATA[<p>ప్రస్తుతం జరుగుతున్న అమరనాథ్ యాత్ర సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. హిమాలయాల మంచు శిఖరాల నడుమ సాగే ఈ కఠినతరమైన ప్రయాణాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా మార్చేందుకు అధికారులు ముందెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మకమైన వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) మోడల్‌ను అమలు చేస్తున్నారు. 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్న ఈ యాత్రలో వ్యర్థాలను అదుపు చేయడమే కాకుండా, వాటి నుంచి ఇంధనాన్ని తయారు చేస్తూ దేశానికే ఒక గొప్ప [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90353/">అమరనాథ్ యాత్రలో అద్భుతంగా  వ్యర్థాల నిర్వహణ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ప్రస్తుతం జరుగుతున్న అమరనాథ్ యాత్ర సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. హిమాలయాల మంచు శిఖరాల నడుమ సాగే ఈ కఠినతరమైన ప్రయాణాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా మార్చేందుకు అధికారులు ముందెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మకమైన వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) మోడల్‌ను అమలు చేస్తున్నారు. 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్న ఈ యాత్రలో వ్యర్థాలను అదుపు చేయడమే కాకుండా, వాటి నుంచి ఇంధనాన్ని తయారు చేస్తూ దేశానికే ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తున్నారు.</p>
<p><strong>ప్లాస్టిక్‌కు పాతర.. క్లాత్ బ్యాగుల పంపిణీ</strong><br />
అమరనాథ్ యాత్ర మార్గంలో సింగిల్ యూజ్ (ఒక్కసారి మాత్రమే వాడే) ప్లాస్టిక్‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. భక్తులు ఎవరైనా పొరపాటున ప్లాస్టిక్ కవర్లతో బేస్ క్యాంప్‌కు చేరుకున్నా, వాటిని అక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి దాదాపు 1.5 లక్షల గుడ్డ సంచులను సిద్ధం చేశారు. భోజన వసతి కల్పించే లంగర్లు, స్థానిక దుకాణదారులు కూడా కేవలం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను మాత్రమే వాడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లాస్టిక్ గ్లాసులు వాడితే భారీ జరిమానాలు విధిస్తున్నారు.</p>
<p><strong>గుర్రాల పేడతో గ్యాస్.. ఇంధనంగా మార్చే మిషన్లు</strong><br />
యాత్ర మార్గంలో భక్తులను చేరవేసేందుకు దాదాపు 25 నుండి 30 వేల వరకు గుర్రాలను ఉపయోగిస్తుంటారు. ఇవి ప్రతిరోజూ విసర్జించే టన్నుల కొద్దీ పేడను సేకరించడం ఒక పెద్ద సవాలుగా మారేది. అయితే ఈసారి తొలిసారిగా ఈ వ్యర్థాలను సేకరించేందుకు అత్యాధునిక యంత్రాలను రంగంలోకి దించారు. ఈ పేడను మీథేన్ గ్యాస్‌గా మార్చడానికి ఐదు క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బాలటాల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ మీథేన్ గ్యాస్‌తో వెలిగే ఒక ప్రత్యేకమైన ల్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసి, వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఎలా తయారు చేయవచ్చో భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.</p>
<p><strong>ఇండోర్ సంస్థ ‘స్వాహా’కు కీలక బాధ్యతలు</strong><br />
ఈ బృహత్తర పర్యావరణ పరిరక్షణ బాధ్యతను దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన ఇండోర్‌కు చెందిన ‘స్వాహా రిసోర్స్ మేనేజ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థకు బాబా అమరనాథ్ శ్రైన్ బోర్డ్ అప్పగించింది. జమ్ముకశ్మీర్ గ్రామీణ పారిశుద్ధ్య విభాగం దీనిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. యాత్ర మార్గంలో ఎక్కడా కొద్దిగా కూడా చెత్త పేరుకుపోకుండా, నిరంతరం సేకరించి ప్రాసెస్ చేస్తున్నారు. యాత్ర ముగిసిన తర్వాత కూడా ‘పర్యావరణ వీరులు’ ట్రాక్ మొత్తాన్ని జల్లెడ పట్టి, పూర్తిగా స్వచ్ఛంగా మార్చిన తర్వాతే అక్కడి నుండి కిందికి దిగుతారని సంస్థ సీఈఓ డాక్టర్ సమీర్ శర్మ తెలిపారు.</p>
<p><strong>400 టన్నుల వ్యర్థాల నిర్వహణకు మాస్టర్ ప్లాన్</strong><br />
ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన యాత్రలో ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ సీజన్ ముగిసే సమయానికి భక్తుల సంఖ్య 5 నుండి 6 లక్షలకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల రెండు మార్గాల నుంచి సుమారు 400 నుండి 700 టన్నుల వరకు ఘన, ద్రవ వ్యర్థాలు జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడానికి ట్రాక్ పొడవునా పెద్ద ఎత్తున డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి 4,000 మందికి పైగా సిబ్బందిని, కేవలం వ్యర్థాల నిర్వహణ కోసమే మరో 623 మంది ఉద్యోగులను మోహరించారు.</p>
<p><strong>వాటర్ ఏటీఎంలతో 30 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లకు చెక్!</strong><br />
సాధారణంగా పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వల్ల కాలుష్యం తీవ్రమౌతుంది. దీనిని అరికట్టడానికి యాత్ర మార్గంలో ఎనిమిది అత్యాధునిక ‘వాటర్ ఏటీఎం’లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటీఎం 12 గంటల్లో సుమారు 6,000 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది. దీనివల్ల భక్తులు ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ వినూత్న ఆలోచన కారణంగా రోజుకు దాదాపు 50 వేల బాటిళ్లు, మొత్తం యాత్ర కాలంలో ఏకంగా 30 లక్షల ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం తగ్గుతుందని అధికారులు లెక్కగట్టారు.</p>
<p><strong>వీధి నాటకాలతో అవేర్‌నెస్</strong><br />
లంగర్లు, విశ్రాంతి స్థలాల వద్ద పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా వీధి నాటకాలు , సాంప్రదాయ తోలుబొమ్మలాటలు (కట్పుత్లీ షోలు) నిర్వహిస్తున్నారు. యాత్రికులు తమ వెంట తిరిగి వాడుకోగలిగే స్టీలు ప్లేట్లు, స్పూన్లు తెచ్చుకోవాలని కోరుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, భక్తులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ యాత్రలో భాగస్వాములవుతున్నారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90353/">అమరనాథ్ యాత్రలో అద్భుతంగా  వ్యర్థాల నిర్వహణ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90353/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>జగన్నాథ నామస్మరణతో మార్మోగిన విశాఖ.. వైభవంగా రథయాత్ర</title>
		<link>https://vskandhra.org/90572/</link>
					<comments>https://vskandhra.org/90572/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 08:30:56 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90572</guid>

					<description><![CDATA[<p>జగన్నాథ నామస్మరణతో విశాఖ నగరం  ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, భజనలు, కోలాటాలు, విష్ణు సహస్రనామ పారాయణలతో నగరంలోని పలు ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. జగన్నాథస్వామి రథయాత్రల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి రథయాత్ర 185 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90572/">జగన్నాథ నామస్మరణతో మార్మోగిన విశాఖ.. వైభవంగా రథయాత్ర</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>జగన్నాథ నామస్మరణతో విశాఖ నగరం  ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, భజనలు, కోలాటాలు, విష్ణు సహస్రనామ పారాయణలతో నగరంలోని పలు ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి.</p>
<p>జగన్నాథస్వామి రథయాత్రల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి రథయాత్ర 185 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు.</p>
<p>జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. సాయంత్రం 5 గంటలకు టౌన్ కొత్తరోడ్డు నుంచి ప్రారంభమైన రథయాత్ర ఏవీఎన్ కాలేజీ డౌన్ రోడ్డు, పూర్ణా మార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది.</p>
<p>అనంతరం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవ విగ్రహాలను టర్నర్ చౌల్ట్రీలోని కల్యాణ మండపంలో ప్రతిష్ఠించారు. ఈ నెల 17 నుంచి 26 వరకు స్వామివారు దశావతార అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.</p>
<p>ఆలయ ఈవో టి. రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రథయాత్రను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి రంగనాథాచార్యులు, జగన్నాథాచార్యులు, యేడిద సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని రథయాత్రలో పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలు, హరినామ సంకీర్తనల మధ్య రథయాత్ర భక్తి, సంప్రదాయాల వైభవాన్ని చాటింది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90572/">జగన్నాథ నామస్మరణతో మార్మోగిన విశాఖ.. వైభవంగా రథయాత్ర</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90572/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం</title>
		<link>https://vskandhra.org/90567/</link>
					<comments>https://vskandhra.org/90567/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 08:00:45 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90567</guid>

					<description><![CDATA[<p>అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచిందని పేర్కొన్నారు. మనం హిందూ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి అని అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ న్యూస్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90567/">విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><strong>అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచిందని పేర్కొన్నారు. మనం హిందూ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి అని అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తన గురించి ఒక హిందువుగా చెప్పుకోవడానికి తానెంతో గర్విస్తానని తెలిపారు. తాను బలమైన హిందూ కుటుంబంలో పెరిగానని చెప్పారు. మతం మార్చుకోవాల్సిన అవసరం కానీ, భావన కానీ తనకు ఎప్పుడూ రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల్లో ఒకటి హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ  జార్జియా రాష్ట్రం తీర్మానం చేయడమైతే మరొకటి హిందుత్వం పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి బహిరంగంగా ప్రకటించడంగా ఉంది.  ఈ రెండు సంఘటనలూ చాలా ముఖ్యమైనవి. నేటి అంతర్జాతీయ సమాజానికి దిక్సూచి లాంటివి. నిజానికి, హిందుత్వంకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక బహుముఖమైన, భిన్నమైన చర్చ జరుగుతోంది. పాశ్చాత్య దేశాలలో, ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి పెరుగుతున్న దౌత్య, ఆర్థిక పలుకుబడితో పాటు, వసుధైవ కుటుంబకం అనే సార్వత్రిక విలువల ద్వారా మానవాళిలో అత్యధికం హిందుత్వంకు సమున్నతమైన గౌరవాన్ని అందిస్తున్నారు.</strong></p>
<p>ఇదే సమయంలో వామపక్ష భావజాలం కలిగిన అనేక వర్గాలు, మీడియా సంస్థలు హిందుత్వంపై ప్రతికూల ప్రచారాన్ని సృష్టించే ప్రయత్నాల్లో నిరంతరం నిమగ్నమై ఉంటున్నాయి. ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వీటికి కంటగింపుగా మారాయి. మే 22న “హిందుత్వం అంటే ఏమిటి.. ఈ రాజకీయ ఉద్యమ మూలాలు ఏమిటి?” అనే శీర్షికతో అల్‌జజీరా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో హిందుత్వకు వ్యతిరేకంగా చేసిన వాదనలు, ‘హిందుత్వ’ అనే పదాన్ని 1923లో వినాయక్ దామోదర్ సావర్కర్ మొదటిసారిగా ఉపయోగించారనే అంచనాపై ఆధారపడి ఉన్నాయి. ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, అల్‌జజీరా వంటి మీడియా సంస్థలు భారతదేశం ఒక రకమైన హిందూ జాతీయవాదం వైపు పయనిస్తోందని, దానివల్ల ప్రజాస్వామ్యం, బహుళత్వం ప్రమాదంలో పడతాయనే ఒక కథనాన్ని వండి వడ్డించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.</p>
<p>వాస్తవానికి హిందుత్వంపై జరిగే చర్చలో ఆరోపణలు అధికంగా ఉంటాయే తప్ప స్పష్టత ఇసుమంత కూడా ఉండదు. ఒక నగరంలో ఏదైనా నేరపూరిత సంఘటన జరిగిందనుకుందాం. ఆ సంఘటనకు మొత్తం నగరాన్నే బాధ్యులను చేయడం సమంజసం కాదు. అదేవిధంగా కేవలం ఒక సంఘటన లేదా అతివాదుల చర్యల ఆధారంగా మొత్తం హిందూ సమాజాన్ని లేదా దాని సాంస్కృతిక సంప్రదాయాన్ని నిందించినట్లయితే, ఆ చర్చ తన అసలు ఉద్దేశం నుంచి పక్కదారి పడుతుంది. ఏదైనా గంభీరమైన చర్చ ఒక నిర్వచనంతోనే మొదలవు తుంది. చర్చనీయాంశం ‘హిందూ ధర్మం’ అయితే, అలాంటి ఒక చర్చ ధార్మికమైన, తాత్విక కోణాలపై ఆధారపడి ఉండాలి. అదే ‘హిందుత్వం’ గురించి అయితే దాని చారిత్రక, సాంస్కృతిక, సైద్ధాంతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ విషయం ఏదైనా రాజకీయ పార్టీ లేదా సంస్థకు సంబంధించినదైతే, దానిపై చేసే విశ్లేషణ రాజకీయ ప్రాతిపదికన ఉండాలి. అయితే, వీటన్నింటినీ కలిపి గందరగోళం సృష్టించినప్పుడే సమస్య తలెత్తుతుంది.</p>
<p>2<img decoding="async" class="alignleft wp-image-21213 size-large" src="https://www.jagritiweekly.com/wp-content/uploads/2026/07/image_1b1738e2-1024x559.png" alt="" width="640" height="349" />021లో ‘డిస్‌మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం’ (ణGH) పేరుతో ఒక అంతర్జాతీయ ఆన్‌లైన్ సదస్సు జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థ లకు చెందిన అధ్యాపకులు, పరిశోధకుల బృందం దీనిని ఏర్పాటు చేసింది. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, కార్నెల్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి 50కి పైగా విశ్వవిద్యాలయాల విభాగాలు, కేంద్రాలు ఈ కార్యక్రమానికి సహ-ప్రాయోజకులుగా వ్యవహ రించాయి. ఈ సందర్భంలో హిందుత్వాన్ని అధిక సంఖ్యాకవాదానికి రూపంగా, అల్పసంఖ్యాక వర్గీయుల హక్కులకు ముప్పుగా చిత్రీకరించారు. అలా ప్రతిపాదించినవారు తాము చేపట్టిన చర్చను ఒక సైద్ధాంతికమైన, విద్యాపరమైన చర్చగా నమ్మబలికారు. అయితే ఇక్కడ విమర్శ జరిగిందన్నది ముఖ్యం కాదు. దానికి బదులుగా భారతీయ నాగరికత, హిందూ భావధార, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన చర్చ, వాదోపవాదాల పరిధి ప్రపంచస్థాయిలో నిరంతరాయంగా విస్తరిస్తోం దని ఇటువంటి సంఘటనలు సూచిస్తున్నాయి.</p>
<p>నేటి ప్రపంచం ఒకప్పటిలా లేదు. ఆలోచనలు ఇకపై దేశ సరిహద్దులకు పరిమితం కానేకావు. విశ్వవిద్యాలయ పరిశోధనలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు, మీడియా చర్చలు, డిజిటల్ వేదికలపై ప్రచారాలు, ప్రవాస సమాజాలలోని సంభాషణలు అన్నీ కలిసి ఒక ప్రపంచవ్యాప్త చర్చను రూపొందిస్తు న్నాయి. తత్ఫలితంగా ఏదైనా భావజాలం, అస్తిత్వం లేదా సాంస్కృతిక సమూహం గురించిన అభిప్రాయాలు కేవలం స్థానికంగానే మిగిలిపోవు. అవి అంతర్జాతీయ సమాజం దృష్టికి వస్తున్నాయి. కనుక ఏదైనా వేదికపై హిందుత్వాన్ని ఒక నిర్దిష్ట దృక్పథంతో ప్రస్తావించినప్పుడు, దాని ప్రభావం కేవలం ఆ సభా ప్రాంగణానికే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి. అక్కడ ప్రస్తావించిన విషయాలు వ్యాసాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ వ్యాసాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు సోషల్ మీడియాకు చేరతాయి. క్రమంగా అవి ఒక స్థిరమైన అభిప్రాయం లేదా దృక్పథంగా మారిపోతాయి.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90567/">విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90567/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
