<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Lord Rama &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/lord-rama/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Mon, 24 Oct 2022 10:28:49 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>Lord Rama &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ</title>
		<link>https://vskandhra.org/35642/</link>
					<comments>https://vskandhra.org/35642/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Mon, 24 Oct 2022 10:28:49 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Bhadrachalam lands]]></category>
		<category><![CDATA[#VHP]]></category>
		<category><![CDATA[Lord Rama]]></category>
		<category><![CDATA[Vishwa Hindu Parishad]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=35642</guid>

					<description><![CDATA[<p>భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని ఈ నెల 21న దర్శించుకుంది. ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో అధికారులతో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/35642/">భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.</p>
<p>హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని ఈ నెల 21న దర్శించుకుంది. ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడింది. దేవాలయ భూములు కబ్జాకు గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీరంతా ఏం చేస్తున్నారని నిలదీసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని దేవాలయ భూములు కబ్జా చేస్తున్నట్టు దేవాలయ అధికారులు పరిషత్ బృందానికి తెలిపారు.</p>
<p>తీర్పులు కూడా దేవాలయ భూమిగా గుర్తించాయని, వందలకొద్దీ తీర్పులు కూడా వెల్లడించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆధారాలతో సహా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేవాలయ భూములను కాపాడుకుంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నందున దేవుడి మాన్యాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>Source: Nijamtoday</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/35642/">భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/35642/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!</title>
		<link>https://vskandhra.org/30966/</link>
					<comments>https://vskandhra.org/30966/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Thu, 23 Jun 2022 12:24:59 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Bharat Gaurav Tourist Train]]></category>
		<category><![CDATA[#Ramayana Yatra]]></category>
		<category><![CDATA[Lord Rama]]></category>
		<category><![CDATA[Tourism]]></category>
		<category><![CDATA[Union Tourism Minister Kishan Reddy]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30966</guid>

					<description><![CDATA[<p>శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి దిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. రామాయణ యాత్ర పేరుతో 18 రోజులపాటు కొనసాగే ఈ రైలు దేశంలో రాముడితో సంబంధం ఉన్న వివిధ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30966/">రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం</span></h3>
</li>
<li>
<h3></h3>
<h3><span style="color: #ff0000">కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి</span></h3>
</li>
</ul>
<p>న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి దిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. రామాయణ యాత్ర పేరుతో 18 రోజులపాటు కొనసాగే ఈ రైలు దేశంలో రాముడితో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాలతోపాటు నేపాల్‌లోని జనక్‌పురి వరకు సాగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.</p>
<p>పర్యాటక శాఖ రైల్వే శాఖతో కలిసి కృష్ణ సర్క్యూట్‌, బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లకు భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైళ్లను నడపనున్నట్టు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. రామాయణ యాత్రకు రైలును ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, వారసత్వ సంపదను తెలియజేయడమే భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ప్రారంభం వెనుక ఉన్న ఉద్దేశమని తెలిపారు.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30966/">రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30966/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>పున్నమి వెన్నెల్లో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం</title>
		<link>https://vskandhra.org/27669/</link>
					<comments>https://vskandhra.org/27669/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Sat, 16 Apr 2022 04:46:01 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[##Sri seetarama kalyanam]]></category>
		<category><![CDATA[#AYODHYA]]></category>
		<category><![CDATA[#Kalyana Ramu]]></category>
		<category><![CDATA[#Ontimitta]]></category>
		<category><![CDATA[#Sri Ramachandra]]></category>
		<category><![CDATA[Lord Rama]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=27669</guid>

					<description><![CDATA[<p>ఒంటిమిట్ట‌: శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు.. సీతాదేవిని మురిపించిన రఘుకులసోముడు కల్యాణవేదికను అధిష్ఠించాడు.. సిగ్గులొలుకుతూ కూర్చున్న జనకమహారాజు పుత్రికను పరిణయమాడాడు. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల ప్రతిధ్వనులు.. తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల మధ్య అయోధ్య రాముడు కల్యాణ రాముడయ్యాడు. ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగింది. జగదానందకరమైన జానకీకల్యాణ ఘట్టంలో జగదభిరాముడు సీతాసమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఎక్కడాలేని విధంగా పండువెన్నెలలో సీతారామకల్యాణం జరగడమన్నది ఒంటిమిట్టలోనే ఏళ్ల [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/27669/">పున్నమి వెన్నెల్లో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ఒంటిమిట్ట‌: శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు.. సీతాదేవిని మురిపించిన రఘుకులసోముడు కల్యాణవేదికను అధిష్ఠించాడు.. సిగ్గులొలుకుతూ కూర్చున్న జనకమహారాజు పుత్రికను పరిణయమాడాడు. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల ప్రతిధ్వనులు.. తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల మధ్య అయోధ్య రాముడు కల్యాణ రాముడయ్యాడు.</p>
<p>ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగింది. జగదానందకరమైన జానకీకల్యాణ ఘట్టంలో జగదభిరాముడు సీతాసమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఎక్కడాలేని విధంగా పండువెన్నెలలో సీతారామకల్యాణం జరగడమన్నది ఒంటిమిట్టలోనే ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది.</p>
<p>సీతాదేవికి చంద్రుడు సోదరుడు కావడంతో ఆయన చూసేలా క్రతువు సాగుతుందని పండితులు చెబుతున్నారు. కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 70 వేల మందికి తితిదే ఏర్పాట్లు చేసింది. విద్యుద్దీపకాంతుల మధ్య ఒంటిమిట్ట ఏకశిలా క్షేత్రం శోభాయమానంగా విలసిల్లింది.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/27669/">పున్నమి వెన్నెల్లో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/27669/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం</title>
		<link>https://vskandhra.org/27613/</link>
					<comments>https://vskandhra.org/27613/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Fri, 15 Apr 2022 03:46:56 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Ontimitta]]></category>
		<category><![CDATA[#RAMA]]></category>
		<category><![CDATA[#Sitarama]]></category>
		<category><![CDATA[#Sitarama kalyanam]]></category>
		<category><![CDATA[Kadapa]]></category>
		<category><![CDATA[Lord Rama]]></category>
		<category><![CDATA[Thirumala]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=27613</guid>

					<description><![CDATA[<p>క‌డ‌ప‌: యావత్‌ దేశమంతా సీతారాముల కల్యాణం నవమిరోజు పట్టపగలు జరిగితే ఏపీలోని ‍ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి ఎనిమిది నుంచి 10 గంటల వరకూ కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ముహూర్తం నిర్ణయించారు. పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వ‌ల్ల ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్టు ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/27613/">నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>క‌డ‌ప‌: యావత్‌ దేశమంతా సీతారాముల కల్యాణం నవమిరోజు పట్టపగలు జరిగితే ఏపీలోని &#x200d;ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి ఎనిమిది నుంచి 10 గంటల వరకూ కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ముహూర్తం నిర్ణయించారు.</p>
<p>పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వ‌ల్ల ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్టు ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట అంగరంగవైభవంగా ముస్తాబైంది. అశేష భక్త జనుల సమక్షంలో కల్యాణం కమనీయంగా సాగనుంది.</p>
<h3><span style="color: #ff0000">రెండేళ్ళ ద‌ర్శ‌న భాగ్యం..</span></h3>
<p>కరోనా కారణంగా రెండేళ్ళ‌ ఏకాంతంగా స్వామివారి కల్యాణం నిర్వహించిన టీటీడీ ఈసారి మాత్రం 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో భ‌క్తుల‌కు క‌ల్యాణ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంది. సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంచినీరు, భోజనాలు సిద్ధం చేసింది.</p>
<h3><span style="color: #ff0000">రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు</span></h3>
<p>కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల కోసం కౌంటర్లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కడప-రేణిగుంట ప్రధాన జాతీయ రహదారిలో ఒంటిమిట్ట ఉండటంతో ఈ మార్గంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 16వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ రాక‌పోక‌ల‌పై విధించారు.</p>
<p>Source: EtvBharat</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/27613/">నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/27613/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>రామాయణం&#8230; జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం</title>
		<link>https://vskandhra.org/21445/</link>
					<comments>https://vskandhra.org/21445/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Fri, 19 Nov 2021 06:49:51 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Indian culture]]></category>
		<category><![CDATA[Lord Rama]]></category>
		<category><![CDATA[The Ramayana]]></category>
		<category><![CDATA[Vice President Venkaiah Naidu]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=21445</guid>

					<description><![CDATA[<p>ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్య‌న‌గ‌రం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్థ‌మ‌య్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/21445/">రామాయణం&#8230; జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు</span></h3>
</li>
</ul>
<p>భాగ్య‌న‌గ‌రం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్థ‌మ‌య్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్​కు ఆయన అభినందనలు తెలిపారు.</p>
<p>రామాయణాన్ని మతానికి చెందిన గ్రంథంగా చూడడం తగదన్న ఆయన, విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో భాగంగా రామాయణాన్ని బోధించాలని సూచించారు. మన గ్రంథాలను సరైన వారిద్వారా, సరైన మార్గంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. నాయకత్వ లక్షణాలు, నిర్వహణా చాతుర్యం, సుపరిపాలన, వనరులను సరైన విధంగా వినియోగించుకునే సామర్థ్యం, వ్యాపార సంబంధాలను, వ్యూహాత్మక పరిచయాలను పెంపొందించుకోవడం వంటి విజయానికి అవసరమైన వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని గాధ మనకు బోధిస్తుందని తెలిపారు.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a>  </span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/21445/">రామాయణం&#8230; జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/21445/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
