బెంగాల్ పాఠ్యాంశాల్లో మార్పులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యా వ్యవస్థలో 2028 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాఠ్యాంశాలు, సిలబస్తో పాటు చరిత్ర, బెంగాలీ సాహిత్య బోధనలోనూ మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు పాఠ్యాంశాలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. సాహిత్య సిలబస్లో కీలక మార్పులు ప్రతిపాదిత సవరణల్లో భాగంగా బెంగాలీ సాహిత్య సిలబస్లో కొన్ని ప్రముఖ రచనల స్థానాలను మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది.‘శివాజీ ఉత్సవ్’ను చేర్చే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా నాటక రచయిత శరత్ చంద్ర సేన్ గుప్తా రచించిన ‘సిరాజ్ ఉద్దౌలా’కు బదులుగా ‘బంగార్ ప్రతాపాదిత్య’ను సిలబస్లో చేర్చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. చరిత్ర పాఠ్యాంశాల్లోనూ మార్పులు చరిత్ర సిలబస్లో కూడా కొన్ని కీలక మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రముఖ విద్యావేత్త,...








