<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Articles &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/category/articles/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Fri, 10 Jul 2026 10:15:58 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.8</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>Articles &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>అమరనాథుడు కరిగిపోతున్నాడా?</title>
		<link>https://vskandhra.org/90180/</link>
					<comments>https://vskandhra.org/90180/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Sat, 11 Jul 2026 07:00:04 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90180</guid>

					<description><![CDATA[<p>వాతావరణ మార్పుల ప్రభావం&#8230; అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగి పోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈనెల 3న యాత్ర ఆరంభమైంది. తర్వాత 5 రోజుల్లోనే శివలింగం భారీగా కరిగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వేల మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90180/">అమరనాథుడు కరిగిపోతున్నాడా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>వాతావరణ మార్పుల ప్రభావం&#8230; అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగి పోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈనెల 3న యాత్ర ఆరంభమైంది. తర్వాత 5 రోజుల్లోనే శివలింగం భారీగా కరిగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వేల మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.</p>
<h3>ఎప్పటి నుంచో హెచ్చరికలు</h3>
<p>హిమాలయాల్లో హిమనీ నదాలు, సహజంగా ఏర్పడే మంచు కొండలు గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులవంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి.</p>
<h3>12 అడుగుల వరకూ..</h3>
<p>సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమర్‌నాథ్‌ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకూ సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది.</p>
<p>శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90180/">అమరనాథుడు కరిగిపోతున్నాడా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90180/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>సాగరం చెప్పే ఆధ్యాత్మిక సత్యాలు..</title>
		<link>https://vskandhra.org/90104/</link>
					<comments>https://vskandhra.org/90104/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Fri, 10 Jul 2026 08:00:07 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90104</guid>

					<description><![CDATA[<p>&#8220;అపూర్యమాణమచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్&#8230;&#8221; అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఉపమానం సముద్రం గొప్పతనాన్ని మాత్రమే కాదు, స్థితప్రజ్ఞుడి మనస్తత్వాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన మహోన్నత వరాల్లో సముద్రం ఒకటి. పైకి ఎగసిపడే అలలతో అందంగా కనిపించే సాగరం, లోపల అపారమైన ప్రశాంతతను దాచుకుని ఉంటుంది. అదే విధంగా మనిషి జీవితానికీ, ఆధ్యాత్మిక సాధనకూ సముద్రం ఎన్నో గొప్ప సందేశాలను అందిస్తుంది. అనంతత్వానికి ప్రతీక సముద్రానికి ఆది, అంతం కనిపించవు. అందుకే అది [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90104/">సాగరం చెప్పే ఆధ్యాత్మిక సత్యాలు..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h1></h1>
<p><strong>&#8220;అపూర్యమాణమచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్&#8230;&#8221;</strong> అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఉపమానం సముద్రం గొప్పతనాన్ని మాత్రమే కాదు, స్థితప్రజ్ఞుడి మనస్తత్వాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన మహోన్నత వరాల్లో సముద్రం ఒకటి. పైకి ఎగసిపడే అలలతో అందంగా కనిపించే సాగరం, లోపల అపారమైన ప్రశాంతతను దాచుకుని ఉంటుంది. అదే విధంగా మనిషి జీవితానికీ, ఆధ్యాత్మిక సాధనకూ సముద్రం ఎన్నో గొప్ప సందేశాలను అందిస్తుంది.</p>
<h3>అనంతత్వానికి ప్రతీక</h3>
<p>సముద్రానికి ఆది, అంతం కనిపించవు. అందుకే అది అనంతత్వానికి ప్రతీకగా భావించబడింది. సముద్రంపై అలలు నిరంతరం ఉప్పొంగుతున్నట్లే మనసులోనూ ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు అలజడి సృష్టిస్తుంటాయి. అయితే సముద్ర గర్భంలో ఉన్న నిశ్శబ్దంలాగే, మనసు లోతుల్లోకి ప్రయాణించినప్పుడు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం, దైవచింతన మనిషిని ఆ స్థితికి తీసుకెళ్తాయి.</p>
<h3>రామనామంతో సముద్రం దాటిన హనుమంతుడు</h3>
<p>రామాయణంలో సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు తొలుత విశాల సముద్రాన్ని చూసి క్షణకాలం సందేహించాడు. కానీ శ్రీరాముని నామస్మరణతో అపారమైన ఆత్మవిశ్వాసం పొందాడు. అనంతరం ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. ఈ సంఘటన భక్తి, విశ్వాసం ఉంటే భవసాగరాన్ని కూడా దాటవచ్చనే శాశ్వత సత్యాన్ని బోధిస్తుంది.</p>
<h3>అలల మధ్యలోనూ ప్రశాంతత</h3>
<p>ఒకసారి సముద్రతీరంలో ధ్యానం చేస్తున్న గురువును శిష్యుడు, &#8220;ఈ అలల శబ్దంలో ధ్యానం ఎలా సాధ్యం?&#8221; అని ప్రశ్నించాడు. దానికి గురువు, &#8220;అలల శబ్దం పైపైనే ఉంటుంది. లోపలికి వెళ్లిన కొద్దీ సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే మనసు స్థిరపడితే బాహ్య పరిస్థితులు దానిని కదిలించలేవు&#8221; అని సమాధానమిచ్చాడు. ఆధ్యాత్మిక సాధనలో అంతర్ముఖత ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది.</p>
<h3>బిందువు నుంచి సింధువుగా</h3>
<p>ఒక నీటి బిందువు సముద్రంలో కలిస్తే తన ఉనికి పోతుందని బాధపడింది. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, &#8220;నీవు నశించడం లేదు. అనంతమైన సముద్రంలో భాగమవుతున్నావు&#8221; అని చెప్పాడని ఆధ్యాత్మిక కథనం వివరిస్తుంది. జీవాత్మ పరమాత్మలో లీనమవడమే మోక్షమనే వేదాంత సారాన్ని ఈ కథ సులభంగా అర్థమయ్యేలా చెబుతుంది.</p>
<h3>గర్వాన్ని తొలగించే అల</h3>
<p>ఒక అల తానే గొప్పదని భావించింది. కానీ కొద్ది సేపటికే అది సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు తనకు స్వతంత్ర ఉనికి లేదని, తాను సముద్రంలో భాగమేనని గ్రహించింది. అలాగే మనిషి అహంకారం కూడా తాత్కాలికమే. అంతా పరమాత్మ సంకల్పమేనని గ్రహించినప్పుడే నిజమైన వినయం కలుగుతుంది.</p>
<h3>సాగర మథనం – అంతర్మథనానికి ప్రతీక</h3>
<p>పురాణాల్లోని క్షీరసాగర మథనం కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, అది మానవ జీవితానికి ప్రతీక. దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించినప్పుడు తొలుత హాలాహల విషం వెలువడింది. అనంతరం లక్ష్మీదేవి, కామధేనువు, ఐరావతం, చంద్రుడు వంటి దివ్య రత్నాలు ప్రత్యక్షమయ్యాయి. చివరకు అమృతం లభించింది.</p>
<p>మన మనస్సూ ఒక సముద్రంలాంటిదే. అందులో కోపం, మోహం, భయం, అహంకారం వంటి విషాలు దాగి ఉంటాయి. ఆత్మపరిశీలన, దైవస్మరణ ద్వారా వాటిని అధిగమించినప్పుడు మాత్రమే జ్ఞానం, శాంతి, ఆనందం అనే అమృతం లభిస్తుంది.</p>
<h3>భగవద్గీతలో సముద్ర ఉపమానం</h3>
<p>శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా ఉపదేశించాడు:</p>
<blockquote><p><strong>&#8220;అపూర్యమాణమచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।<br />
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ॥&#8221;</strong></p></blockquote>
<p>ఎన్ని నదులు సముద్రంలో కలిసినా అది పొంగిపోదు. అలాగే ఇంద్రియ విషయాలు వచ్చినా, కోరికలు కలిగినా వాటికి లోనుకాని వ్యక్తికే నిజమైన శాంతి లభిస్తుంది.</p>
<h3>మహాత్ముల మనసు సాగరంలాంటిదే</h3>
<p>శాస్త్రాలు సముద్రాన్ని మహాత్ముల హృదయంతో పోలుస్తాయి.</p>
<blockquote><p><strong>&#8220;యథా సముద్రో భగవాన్ దుర్విగాహ్యో దురత్యయః ।<br />
తథైవ హి మహాత్మానో గంభీరాశ్చ దురాసదాః ॥&#8221;</strong></p></blockquote>
<p>సముద్రం ఎంత లోతుగా ఉంటుందో తెలుసుకోవడం ఎంత కష్టమో, మహాత్ముల హృదయ గాంభీర్యాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం.</p>
<h3>సమభావమే స్థితప్రజ్ఞత</h3>
<p>అన్ని నదులూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అలాగే అన్ని ఆధ్యాత్మిక మార్గాల అంతిమ గమ్యం పరమాత్మనే. సముద్రం ఎన్ని నదులు చేరినా పొంగిపోదు, ఎండాకాలంలోనూ ఎండిపోదు. అదే సమభావం, అదే స్థితప్రజ్ఞత.</p>
<p>జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు సహజం. కానీ వాటికి చలించకుండా సముద్రంలా గంభీరంగా, ప్రశాంతంగా ఉండడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం.</p>
<p>సముద్రం ప్రకృతిలో ఒక అద్భుతం మాత్రమే కాదు, మనిషికి నిత్యం బోధించే మౌన గురువు కూడా. అలలతో అలజడి సృష్టించినా లోపల నిశ్చలంగా ఉండే సాగరం, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అంతరంగంలో ప్రశాంతతను నిలుపుకోవాలని మనకు బోధిస్తుంది. అహంకారాన్ని విడిచి, దైవస్మరణతో మనసును పరిశుద్ధం చేసుకున్నప్పుడే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. అదే సముద్రం మనకు అందించే శాశ్వత ఆధ్యాత్మిక సందేశం.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90104/">సాగరం చెప్పే ఆధ్యాత్మిక సత్యాలు..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90104/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భారత్ పునరుత్థాన దిశగా నలందా</title>
		<link>https://vskandhra.org/90020/</link>
					<comments>https://vskandhra.org/90020/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Fri, 10 Jul 2026 07:30:35 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90020</guid>

					<description><![CDATA[<p>ప్రపంచంలో అనేకమంది మేధావుల, జిజ్ఞాసువుల జ్ఞానతృష్ణను ఏడు శతాబ్దాల పాటు తీర్చిన నలంద విశ్వవిద్యాలయంలో విద్యా సముపార్జనకు నాటి మేధావులు తహతహలాడేవారు. యూరప్‌లోని ప్రాచీన బోలోగ్నా యూనివర్సిటీ, ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల కంటే 500 ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ప్రపంచానికి మేధో సంపత్తిని పంచిపెట్టింది. అంతటి మహా విద్యాలయం మతోన్మాద మూర్ఖతకు దహనమై విద్యార్థులకు వేదనను మిగిల్చింది. దాదాపు శతాబ్దాల అనంతరం దాని పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టిపెట్టడం అత్యంత హర్షణీయం, స్వాగతించవలసిన విషయం. ప్రధాని మోదీ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90020/">భారత్ పునరుత్థాన దిశగా నలందా</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ప్రపంచంలో అనేకమంది మేధావుల, జిజ్ఞాసువుల జ్ఞానతృష్ణను ఏడు శతాబ్దాల పాటు తీర్చిన నలంద విశ్వవిద్యాలయంలో విద్యా సముపార్జనకు నాటి మేధావులు తహతహలాడేవారు. యూరప్‌లోని ప్రాచీన బోలోగ్నా యూనివర్సిటీ, ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల కంటే 500 ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ప్రపంచానికి మేధో సంపత్తిని పంచిపెట్టింది. అంతటి మహా విద్యాలయం మతోన్మాద మూర్ఖతకు దహనమై విద్యార్థులకు వేదనను మిగిల్చింది. దాదాపు శతాబ్దాల అనంతరం దాని పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టిపెట్టడం అత్యంత హర్షణీయం, స్వాగతించవలసిన విషయం.</p>
<p>ప్రధాని మోదీ 135వ ‘మన్ కీ బాత’లో అనేక విషయాలపై అభిప్రాయాలు వెల్లడిస్తూ ‘నలంద విశ్వవిద్యాలయ’ పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా మరోసారి నలందపై కొత్త ఆసక్తి మొదలైంది. రెండేళ్ల క్రితం నలంద ప్రాంగణాన్ని ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ప్రధాని మోదీ. నలంద విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం సందర్భంగా మే,17,18 తేదీల్లో ‘శాస్త్రార్థ -2026’ పేరిట మేధోమథనం జరిగింది. “శాస్తార్థ సంప్రదాయం: చరిత్ర, ఆచరణ-సమకాలీన ప్రాసంగికత” అనే అంశంపై నిపుణులతో వినూత్న పద్ధతిలో చర్చా కార్యక్రమం జరిగింది. భారతదేశ జ్ఞాన సంప్రదాయంలోని వివిధ వైఖరులు, దృక్పథాలకు చెందిన పండితులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతకు మన ప్రాచీన మేధో మూలాలను అన్వయించడం అత్యవసరమని ప్రధాని అభిప్రాయ పడడం ముదావహం.</p>
<p>సాధారణ శకం 427లో గుప్త సామ్రాజ్య చక్రవర్తి తొలి కుమార గుప్తుడు స్థాపించిన నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యÖనివర్సిటి. మధ్యయుగాలనాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన నలందలో రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అనే మÖడు భవనాలతో ఉండే గ్రంథాలయాల్లో కోటికి పైగా పుస్తకాలు ఉండేవని.. తూర్పుఆసియా, మధ్యఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10 వేలమందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది.</p>
<p>మాల్వా పీఠభూమికి ఉత్తర దిక్కున ఉన్న రాజగిరి జిల్లా కుండపోత వర్షాలకు, ఆకస్మిక వరదలకూ నెలవు. కుమార గుప్తుడు పధ్నాలుగు వర్షాకాలాలు రాజగిరి ప్రాంతంలో గడిపి, నలందను నిర్మించాడని పురావస్తు శాస్త్రజ్ఞుడు అమలానంద ఘోష్ తమ ‘నలంద’ గ్రంథంలో అంటారు. నలంద విశ్వవిద్యాలయంలోని పుస్తక భాండాగారం అంతటిది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండేది కాదు.</p>
<p>నలంద విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒకదాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే 9 అంతస్తుల భవనమని అభివర్ణించారు. శిఖరాలను అధిరోహించడం, గహనాటవులను జయించడం, ప్రహేళికలను పరిష్కరించడమే కాదు..సమస్త జీవనరంగాలను వ్యాఖ్యానించగల శాస్త్ర ప్రమాణాలను రూపొందించిన ఘనత ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికే దక్కుతుంది.  అధ్యయనం, పరిశోధనలు నైపుణ్యంగా, ప్రాచీనతలోకి తొంగిచూసేందుకు అవశ్యమైన సామర్థ్యంగా తీర్చిదిద్దేందుకు ‘శాస్త్రార్థ’ సంప్రదాయాన్ని నెలకొల్పింది.</p>
<p>నలందలో నాగార్జునుడు, వసుబంధు, శాంతరక్షిత, కమలాశిల వంటి గొప్ప పండితులు మధ్యయుగ శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి దారితీసిన మాండలిక తార్కిక పద్ధతి (Dialectical reasoning method)ని అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు. ఈ విధానం మధ్య ఆసియాకు, చివరికి అరబ్ ప్రపంచం, యÖరప్ దేశాలకు వ్యాపించి, ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేసింది.</p>
<p>సాధారణశకం 5వ శతాబ్దంలో మిహిర్కుల ఆధ్వర్యంలో హూణులు నలంద విద్యా కేంద్రంపై దాడి చేశారు. సాధారణ శకం చిట్టచివర (1193) ప్రాంతంలో  దురాక్రమణదారుడైన భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని దోపిడీ దళాలు ఉత్తర, తూర్పు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు నలంద జ్ఞాన భాండాగారం ధ్వంసమై పోయింది. ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించిన ఖిల్జీ నలందను నాశనం చేశాడని చరిత్ర చెపుతోంది.</p>
<p>ఖిల్జీ దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం మÖడు నెలల పాటు దహనమైందంటారు చరిత్రకారులు. దీనినిబట్టి ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం వైశాల్యం ఎంతో, నిర్మాణ పటిష్ఠత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైన హెచ్‌డీ సంకాలియా 1934లో ప్రచురించిన తన ‘ది యూనివర్సిటీ ఆఫ్ నలంద’ పుస్తకంలో భారీ కోట తరహా నిర్మాణం, అక్కడున్న సంపద గురించి, అప్పటికే జరిగిన ప్రచారం ఖిల్జీ ముఠాను దాడికి పురికొల్పి ఉండొచ్చని రాశారు.</p>
<p>నలంద పునరుద్ధరణ కోసం భారత పార్లమెంటు 2010లో ఒక చట్టాన్ని ఆమోదించి నప్పటికీ ఆ తరువాత పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 2014లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃప్రారంభించింది. రెండేళ్ల క్రితం ప్రాంగణాన్ని ప్రారంభించారు. సరికొత్త నలందను ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా గుర్తించడం మనందరం గర్వించదగ్గ విషయం. 2016లో నలందా శిథిలాలను ప్రపంచ వారసత్వ స్థలం (సంపద) గా యునెస్కో ప్రకటించింది.</p>
<p>నలంద భారతదేశ విద్యా వైభవానికి, ఆసియా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక మాత్రమే కాదు ప్రపంచ చరిత్రలో విద్యాదానం చేసిన మహా విద్యాలయమని కూడా చెప్పుకోవాలి. నలంద పునరుజ్జీవనం భారతదేశానికి తలమానికం కాగలదని ఆశిద్దాం.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90020/">భారత్ పునరుత్థాన దిశగా నలందా</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90020/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>హిందూ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం</title>
		<link>https://vskandhra.org/90107/</link>
					<comments>https://vskandhra.org/90107/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Fri, 10 Jul 2026 07:00:59 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90107</guid>

					<description><![CDATA[<p>&#8220;కుటుంబమే తొలి పాఠశాల.. తల్లిదండ్రులే తొలి గురువులు&#8221; అనే భావనను వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మం ప్రపంచానికి తెలియజేసింది. హిందూ కుటుంబ వ్యవస్థ కేవలం రక్తసంబంధాల సమూహం కాదు; అది ధర్మం, సంస్కారం, బాధ్యత, ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం వంటి విలువలపై నిర్మితమైన జీవన విధానం. అందుకే భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగింది. ధర్మమే కుటుంబానికి ఆధారం సనాతన ధర్మంలో కుటుంబం ఒక పవిత్ర వ్యవస్థ. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90107/">హిందూ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><em>&#8220;కుటుంబమే తొలి పాఠశాల.. తల్లిదండ్రులే తొలి గురువులు&#8221;</em> అనే భావనను వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మం ప్రపంచానికి తెలియజేసింది. హిందూ కుటుంబ వ్యవస్థ కేవలం రక్తసంబంధాల సమూహం కాదు; అది ధర్మం, సంస్కారం, బాధ్యత, ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం వంటి విలువలపై నిర్మితమైన జీవన విధానం. అందుకే భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగింది.</p>
<h2>ధర్మమే కుటుంబానికి ఆధారం</h2>
<p>సనాతన ధర్మంలో కుటుంబం ఒక పవిత్ర వ్యవస్థ. వివాహం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు; రెండు కుటుంబాల, రెండు వంశాల, రెండు సంస్కృతుల కలయికగా భావిస్తారు. గృహస్థాశ్రమం నాలుగు ఆశ్రమాలలో అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనబడింది. ఎందుకంటే బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులకు కూడా ఆధారం గృహస్థుడే.</p>
<p>భార్యాభర్తలు పరస్పరం ధర్మాన్ని ఆచరిస్తూ, పిల్లలకు మంచి సంస్కారాలను అందిస్తూ సమాజ నిర్మాణానికి పునాది వేస్తారు.</p>
<h2>ఉమ్మడి కుటుంబం – భారతీయ ప్రత్యేకత</h2>
<p>ఒకే ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి జీవించడం హిందూ కుటుంబ వ్యవస్థలో ప్రత్యేకత. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం ఈ వ్యవస్థకు మూల సూత్రాలు.</p>
<p>తాతలు, అమ్మమ్మలు చెప్పే రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస కథలు పిల్లల్లో నైతిక విలువలు, భక్తి, దేశభక్తి, ధైర్యం, కర్తవ్యబోధను పెంపొందిస్తాయి.</p>
<h2>సంస్కారాలకు నిలయం</h2>
<p>శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకు హిందూ ధర్మంలో అనేక సంస్కారాలు ఉన్నాయి. నామకరణం, అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, ఉపనయనం వంటి ప్రతి సంస్కారం వ్యక్తి జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు ఉద్దేశించబడింది.</p>
<p>పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. అందుకే కుటుంబంలో పెద్దలు ఆచరించే పూజ, జపం, సత్యవచనం, దానం, సేవ వంటి విలువలు తరువాతి తరానికి వారసత్వంగా అందుతాయి.</p>
<h2>మహిళకు విశిష్ట స్థానం</h2>
<p>హిందూ సంప్రదాయంలో మహిళను గృహలక్ష్మిగా, శక్తి స్వరూపిణిగా భావిస్తారు. &#8220;యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః&#8221; అని మనుస్మృతిలో చెప్పబడింది. అంటే మహిళలను గౌరవించే చోటే దేవతలు నివసిస్తారని భావం.</p>
<p>తల్లి కుటుంబానికి మొదటి గురువు. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో ఆమె పాత్ర అమూల్యమైనది. ప్రేమ, క్రమశిక్షణ, సంస్కారం, కరుణ వంటి విలువలను తల్లి నుంచే పిల్లలు మొదట నేర్చుకుంటారు.</p>
<h2>పండుగలు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి</h2>
<p>ఉగాది, శ్రీరామ నవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు. కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, బంధువులను కలుసుకోవడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి.</p>
<h2>నేటి కాలంలో ఎదురవుతున్న సవాళ్లు</h2>
<p>ఆధునిక జీవనశైలి, ఉద్యోగాల కోసం వలసలు, సాంకేతిక ప్రభావం, వ్యక్తిగత జీవన విధానాల పెరుగుదల కారణంగా ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉన్నా, ఒకరితో ఒకరు గడిపే సమయం తగ్గుతోంది. దీంతో సంస్కారాల బదిలీ కూడా క్రమంగా తగ్గిపోతోంది.</p>
<p>అయితే కుటుంబ విలువలను కాపాడుకోవడం ఇప్పటికీ సాధ్యమే. రోజూ కలిసి భోజనం చేయడం, పిల్లలకు ధార్మిక కథలు చెప్పడం, ఇంట్లో పూజలు నిర్వహించడం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి చిన్న చిన్న అలవాట్లు కుటుంబ వ్యవస్థను బలపరుస్తాయి.</p>
<p>నేటి ప్రపంచంలో ఒంటరితనం, కుటుంబ విభేదాలు, వృద్ధుల నిర్లక్ష్యం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ కుటుంబ వ్యవస్థలోని పరస్పర సహకారం, బాధ్యత, ప్రేమ, గౌరవం వంటి విలువలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.</p>
<p>కుటుంబం బలంగా ఉంటే సమాజం బలపడుతుంది. సమాజం బలపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే హిందూ కుటుంబ వ్యవస్థను కేవలం ఒక సామాజిక నిర్మాణంగా కాకుండా, సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానంగా భావిస్తారు.</p>
<p>హిందూ కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి జీవనాడి. ధర్మం, ప్రేమ, త్యాగం, సేవ, గౌరవం, బాధ్యత వంటి శాశ్వత విలువలను తరతరాలకు అందించే పవిత్రమైన వ్యవస్థ ఇది. కాలం మారినా, జీవనశైలి మారినా, ఈ విలువలను కాపాడుకోవడం ప్రతి కుటుంబం బాధ్యత. కుటుంబంలో ధర్మం నిలిస్తే సమాజంలో శాంతి నిలుస్తుంది; సమాజంలో శాంతి నిలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90107/">హిందూ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90107/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆచార్యవాన్‌ పురుషోవేదః</title>
		<link>https://vskandhra.org/90070/</link>
					<comments>https://vskandhra.org/90070/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Thu, 09 Jul 2026 07:00:34 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90070</guid>

					<description><![CDATA[<p>భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధం చాలా పవిత్రమైనది. అమ్మానాన్నల తర్వాత ఆచార్యులకే పెద్ద పీటవేశారు. గురు అనే పదానికి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్థం. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు, ఇతిహాసాల నుంచి భక్తి సాహిత్యం వరకు, ప్రతి చోటా గురుత్వానికి ఉన్నత స్థానం ఉంది. ఆచార్యవాన్‌ పురుషోవేదః అని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతుంది. అంటే గురువును ఆశ్రయించినవాడే నిజమైన జ్ఞానాన్ని పొందగలడని అర్థం. గురు తత్వాన్ని ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ప్రతిపాదించిన గ్రంథాలలో ‘గురుగీత’ విశిష్ట స్థానం పొందింది. గురువును [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90070/">ఆచార్యవాన్‌ పురుషోవేదః</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><strong>భా</strong>రతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధం చాలా పవిత్రమైనది. అమ్మానాన్నల తర్వాత ఆచార్యులకే పెద్ద పీటవేశారు. గురు అనే పదానికి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్థం. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు, ఇతిహాసాల నుంచి భక్తి సాహిత్యం వరకు, ప్రతి చోటా గురుత్వానికి ఉన్నత స్థానం ఉంది.</p>
<p>ఆచార్యవాన్‌ పురుషోవేదః అని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతుంది. అంటే గురువును ఆశ్రయించినవాడే నిజమైన జ్ఞానాన్ని పొందగలడని అర్థం. గురు తత్వాన్ని ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ప్రతిపాదించిన గ్రంథాలలో ‘గురుగీత’ విశిష్ట స్థానం పొందింది. గురువును ఎందుకు ఆశ్రయించాలి, అసలు జ్ఞానమంటే ఏంటి, మోక్షానికి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే ప్రశ్నలకు ‘గురుగీత’ సమాధానమిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు పరమశివుడు ఇచ్చిన ఉపదేశమే ఈ ‘గురుగీత’. ఇందులో శివుడు గురువును బ్రహ్మస్వరూపుడిగా పరబ్రహ్మతత్వానికి ప్రతీకగా వివరిస్తాడు. భక్తి అనేది అంధానుకరణ కాదని జ్ఞానాన్వేషణకు దారితీసే అంతర్ముఖ వినయమని ‘గురుగీత’ చెబుతుంది.</p>
<p>మనిషి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వయంకృషితో ఆరంభించినప్పటికీ అది పరిపూర్ణమవ్వడానికి గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. అరిషడ్వర్గాల వంటి బంధనాల మాయావరణాన్ని ఛేదించి ఆత్మతత్వాన్ని దర్శింపజేసేది గురువేనని ‘గురుగీత’ బోధిస్తుంది. అందువల్ల గురువు కేవలం బోధకుడు మాత్రమే కాదు, శిష్యుడిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పే జ్ఞానదీపం. భగవంతుడి గురించి ఎన్నో పురాణేతిహాసాలు చెబుతాయి. కానీ దైవత్వాన్ని అనుభవంగా మార్చి చూపించేది గురువు మాత్రమే అంటుంది ‘గురుగీత’.</p>
<p>భగవద్గీత కృష్ణార్జున అనుబంధాన్ని గురుశిష్యుల సంబంధంగా అభివర్ణిస్తుంది. యుద్ధభూమిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు కర్తవ్యబోధ చేశాడు. జీవిత సత్యాన్ని దర్శింపచేశాడు. సందేహం నుంచి స్థితప్రజ్ఞత వైపు తీసుకెళ్లిన ఆ మార్గదర్శకత్వమే నిజమైన గురుత్వం. గురుశిష్యుల సంప్రదాయం గురించి ప్రస్తావనలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు&#8230; ఇంకా అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. జంతువులు, పక్షులు మనుషులు&#8230; సమస్త ప్రకృతి నుంచి జ్ఞానాన్ని గ్రహించవచ్చునని దత్తాత్రేయుడి చరిత్ర చెబుతుంది. గురుకుల వ్యవస్థ, ఆచార్యుడి ప్రాధాన్యం, ధర్మబోధనలో గురువు పాత్ర మొదలైన విషయాలను విష్ణుపురాణం తెలియజేస్తుంది.</p>
<p>గురుశిష్యుల సంప్రదాయం ఎన్నో అత్యుత్తమ వ్యక్తిత్వాలను నిర్మించింది. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర ధర్మతత్వాన్ని, అర్జునుడు ద్రోణాచార్యుల దగ్గర ఏకాగ్రతతో కూడిన విలువిద్యను నేర్చుకున్నారు. రామకృష్ణ పరమహంసతో సాన్నిహిత్యం స్వామి వివేకానందను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించింది.</p>
<p>అద్వైత వేదాంతాన్ని పునరుద్ధరించి భారతదేశమంతటా జ్ఞాన ప్రచారం చేసి, గురు పరంపరను బలోపేతం చేశారు ఆదిశంకరాచార్యులు. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని భగవంతుడికన్నా ముందు నిలబెట్టింది. ఎందుకంటే, భగవంతుడి వైపు చూపించే చేయి గురువుది కాబట్టి. మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ గురువును పరబ్రహ్మ స్వరూపంగా కీర్తిస్తూ, ఆయనను ఆశ్రయించినవారే ఆధ్యాత్మిక యాత్రలో గమ్యాన్ని సులభంగా చేరగలరని ప్రతిపాదిస్తాయి.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90070/">ఆచార్యవాన్‌ పురుషోవేదః</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90070/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఇండోనేషియాలో  అతిపెద్ద హిందూ ఆలయ పునరుద్ధరణకు భారత్‌ సహకారం</title>
		<link>https://vskandhra.org/90057/</link>
					<comments>https://vskandhra.org/90057/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Thu, 09 Jul 2026 06:00:36 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90057</guid>

					<description><![CDATA[<p>ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబనన్‌ ఆలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పర్యటన చేపట్టారు. భారత్‌, ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆలయ పునరుద్ధరణకు సహకరించే అంశంపై కూడా భారత్‌ తన ఆసక్తిని వెల్లడించే అవకాశం ఉంది. ప్రంబనన్‌ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది. 9వ శతాబ్దంలో మతారం రాజవంశం కాలంలో దీన్ని [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90057/">ఇండోనేషియాలో  అతిపెద్ద హిందూ ఆలయ పునరుద్ధరణకు భారత్‌ సహకారం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబనన్‌ ఆలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పర్యటన చేపట్టారు. భారత్‌, ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆలయ పునరుద్ధరణకు సహకరించే అంశంపై కూడా భారత్‌ తన ఆసక్తిని వెల్లడించే అవకాశం ఉంది.</p>
<p>ప్రంబనన్‌ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది. 9వ శతాబ్దంలో మతారం రాజవంశం కాలంలో దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఇక్కడ మొత్తం 240 ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం వాటిలో చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆలయ సముదాయం ఇప్పటికీ ఇండోనేషియా చారిత్రక సంపదలో కీలక స్థానాన్ని దక్కించుకుంది.</p>
<p>ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆకర్షణ 47 మీటర్ల ఎత్తైన శివ మహాదేవాలయం. ప్రంబనన్‌లో ఇదే అత్యంత ఎత్తైన నిర్మాణం. దీనితో పాటు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడికి చెందిన మరో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. హిందూ ఆలయ నిర్మాణ కళకు ఇది అత్యుత్తమ ఉదాహరణగా గుర్తింపు పొందింది.</p>
<p>1991లో యునెస్కో ప్రంబనన్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. గతంలో భూకంపాల కారణంగా ఆలయం దెబ్బతిన్నా తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆలయ గోడలపై భారత ఇతిహాసం రామాయణంలోని ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. ఆలయం చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తూ వెళితే రామాయణ కథ మొత్తం కనిపించేలా శిల్పాలు రూపొందించారు.</p>
<p>పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రంబనన్‌ ఇప్పటికీ హిందువులకు ప్రముఖ ఆరాధనా కేంద్రంగానూ కొనసాగుతోంది. మహాశివరాత్రి వంటి పండుగల సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనతో భారత్‌, ఇండోనేషియా మధ్య సాంస్కృతిక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణలో భారత్‌ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య నాగరికతల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90057/">ఇండోనేషియాలో  అతిపెద్ద హిందూ ఆలయ పునరుద్ధరణకు భారత్‌ సహకారం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90057/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..</title>
		<link>https://vskandhra.org/90049/</link>
					<comments>https://vskandhra.org/90049/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 09:30:26 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90049</guid>

					<description><![CDATA[<p>పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే పెద్ద పుషాల కార్తె మంగళవారం గిరిజనులు సీత్లాపండుగను జరుపుకోవడం ఆనవాయితీ. బంజారాలు జరుపుకునే పండుగల్లో ఇదే తొలి పండుగ. ఈ ఏడాది పెద్ద పుషాల  సీత్లా పండుగను జరుపుకోవడానికి గిరిజనులు సన్నద్ధమయ్యారు. పూర్వ కాలం [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90049/">ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే పెద్ద పుషాల కార్తె మంగళవారం గిరిజనులు సీత్లాపండుగను జరుపుకోవడం ఆనవాయితీ. బంజారాలు జరుపుకునే పండుగల్లో ఇదే తొలి పండుగ. ఈ ఏడాది పెద్ద పుషాల  సీత్లా పండుగను జరుపుకోవడానికి గిరిజనులు సన్నద్ధమయ్యారు.</p>
<p><strong>పూర్వ కాలం నుంచే..</strong></p>
<p>సీత్లా పండుగ ఆచారం పూర్వం నుంచి కొనసాగుతుంది. బంజారాలు వందల సంఖ్యలో పశు సంపదను కలిగి ఉండేవారు. వాతావరణంలో స్వల్ప మార్పులు వచ్చినప్పుడల్లా పశువులు రోగాల బారిన పడేవి. వర్షాకాలం మొదలు కాగానే తండాల్లోని పశువులు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండేవి. పశువులకు జ్వరం, కాలు డెక్కలు చెడిపోవడం, నోరు చెడి మేత మేయకపోవడం మొదలగు లక్షణాలతో పశువులు మృత్యువాత పడుతుండేవి. మనుషులకు వాంతులు, విరేచనాలు (గత్తర) కలర వ్యాధితో వైద్యం అందుబాటులో లేక అనేక మంది మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురైన గిరిజనులు సీత్లామాతను పూజిస్తూ గొర్రెపోతును బలి ఇచ్చి రోడ్డుకు ఇరువైపుల పేగులు అల్లి వాటిపై నుంచి పశువులను దాటిస్తారు. నవ ధాన్యంలో గొర్రెపోతు రక్తం కలిపి పశువులపై చల్లుతారు. ఈ సీత్లాపండుగ ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తోంది.</p>
<p><strong>సీత్లాభవానికి పూజలు ఇలా..</strong></p>
<p>పశుసంపద రక్షణ కోసం గోర్‌ బంజారాలు ఏడుగురు దేవతలైన మేరామా, తోళ్జ్యా, మాత్రాల్‌, కంకాళి, హింగ్లా, ద్వాళంగర్‌, సీత్లా మాతాలను పూజిస్తారు. వీరితో పాటు వారికి రక్షణగా ఉండే లుంకిడ్యాను సైతం కొలుస్తారు. వర్షాకాల ఆరంభంలో పునర్వసు పెద్దపుషాల కార్తెలో ఏదైన ఒక మంగళవారం వీలు చూసుకుని సీత్లామాతను కొలుస్తారు. అన్ని పండుగల వలే ఇళ్లల్లో కాకుండా తండాకు దగ్గరగా ఉండే చెరువు ఒడ్డున లేదా రోడ్డుపై ఈ పూజ చేస్తారు. పొడవాటి రాళ్లతో తయారు చేసిన ఏడు ప్రతిమలను ఒకే వరుసలో ప్రతిష్ఠించి వాటికి ఎదురుగా వంద అడుగుల దూరంలో లుంకిడ్యా ప్రతిమను ఏర్పాటు చేస్తారు. తండాల్లోని మహిళలు, ఆడపడుచులు (లాప్సి) నైవేద్యం, నవధాన్యాలు, పరిశుభ్రమైన నీటిని తీసుకుని పాటలు పాడుతూ&#8230; నృత్యం చేసుకుంటూ దేవతలను ప్రతిష్ఠించిన ప్రదేశానికి చేరుకుంటారు. సీత్లామాతకు లంబాడీల ఆచార సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. సల్లంగ సూడు తల్లి అంటూ వేడుకుంటారు.</p>
<p><strong>ఒకే రోజు సీత్లా పండుగ జరుపుకునేందుకు..</strong></p>
<p>దేశంలోని గోర్‌బంజారులంతా ఒకే తేదీనా సీత్లా పండుగ జరుపుకునేందుకు మహబూబాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు బానోత్‌ నెహ్రూరాథోడ్‌ 12 సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం పండుగను జరుపుకోనున్నారు. గోర్‌ సిక్వాడీ వేదిక.. గిరిజన సమాజంలో చైతన్యం కోసం పని చేస్తున్నాయి. గిరిజన తండాల్లోనే కాకుండా ఉద్యోగ, వ్యాపార రీత్యా నగరాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న గిరిజనులు కూడా సీత్లా భవాని పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90049/">ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90049/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>పాదాభివందనం… పరమార్థం!</title>
		<link>https://vskandhra.org/90017/</link>
					<comments>https://vskandhra.org/90017/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 08:00:40 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90017</guid>

					<description><![CDATA[<p>ఇటీవల క్రికెట్‌ ‌మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ, సీనియర్‌ ‌క్రికెటర్‌, శ్రీ‌లంక మాజీ కెప్టెన్‌ అనుర టెన్నెకూన్‌ ‌పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా కోసం చేసిన చర్యలా కనిపించలేదు. సహజంగా వచ్చిన సంస్కారంలా అనిపించింది. ప్రతిభతోపాటు వినయం ఉంటేనే వ్యక్తిత్వానికి పూర్తి అందం వస్తుందనే సందేశాన్ని ఆ దృశ్యం ఇచ్చింది. అతని బ్యాటింగ్‌ ‌మ్యాచ్‌లను గెలిపించవచ్చు. కానీ ఆ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90017/">పాదాభివందనం… పరమార్థం!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h3>ఇటీవల క్రికెట్‌ ‌మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ, సీనియర్‌ ‌క్రికెటర్‌, శ్రీ‌లంక మాజీ కెప్టెన్‌ అనుర టెన్నెకూన్‌ ‌పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా కోసం చేసిన చర్యలా కనిపించలేదు. సహజంగా వచ్చిన సంస్కారంలా అనిపించింది. ప్రతిభతోపాటు వినయం ఉంటేనే వ్యక్తిత్వానికి పూర్తి అందం వస్తుందనే సందేశాన్ని ఆ దృశ్యం ఇచ్చింది.</h3>
<p>అతని బ్యాటింగ్‌ ‌మ్యాచ్‌లను గెలిపించవచ్చు. కానీ ఆ వినయం ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. చిన్న వయసులోనే పేరు, గుర్తింపు, ప్రశంసలు వస్తున్న సమయంలో కూడా పెద్దల పట్ల గౌరవం తగ్గకపోవడం మంచి పెంపకానికి నిదర్శనం. విజయానికి చేరువవుతున్న ప్రతి యువతరం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఇదే.</p>
<p>మన దేశంలో తల్లిదండ్రులు, తాతమ్మలు, గురువులు, పెద్దలు, ఆధ్యాత్మిక గురువుల పాదాలకు నమస్కరించడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ దీన్ని కేవలం ‘‘పెద్దలను గౌరవించడం’’ అనే ఒకే అర్థానికి పరిమితం చేయడం సరైంది కాదు. పరీక్షకు వెళ్లేముందు పిల్లలు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, కొత్త ఉద్యోగానికి బయలుదేరే యువకుడు ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వివాహ సమయంలో వధూవరులు పెద్దలకు నమస్కరించడం, విద్యార్థి గురువును గౌరవించడం… ఇవి అన్నీ మన జీవితంలో మనకంటే ముందుగా నడిచిన వారి పాత్రను గుర్తించే సందర్భాలు.</p>
<p>‘‘మీరు నడిచిన దారిని నేను గౌరవిస్తున్నాను. మీరు నాకు చేసిన మేలును గుర్తిస్తున్నాను. నేను ముందుకు సాగుతున్నప్పుడు మీ దీవెనలు కావాలి’’ అని మాటల్లో చెప్పకుండానే తెలియజేసే సంస్కారం పాదాభివందనం.</p>
<p>ఇది చిన్నవారు పెద్దవారికంటే తక్కువవారని చెప్పే ఆచారం కాదు. ఎవరూ ఒంటరిగా ఎదగరనే సత్యాన్ని గుర్తుచేసే చర్య. ఒకరి ఎదుగుదల వెనుక తల్లిదండ్రుల త్యాగం, గురువుల బోధన, కుటుంబం ఇచ్చిన రక్షణ, సమాజం అందించిన అవకాశాలు ఉంటాయి. అందుకే పాదాలకు నమస్కరించడం అంటే అహాన్ని కాసేపు పక్కన పెట్టి, మన ఎదుగుదల వెనుక ఉన్న అనుబంధాలను గుర్తించడమే.</p>
<p>అయితే ఈ ఆచారంలో మనం మరిచిపోతున్న ఒక ముఖ్యమైన భాగం ఉంది- అది పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం.</p>
<p>కుటుంబ సమావేశాల్లో, స్నేహితుల ఇళ్లలో, పండుగల సందర్భంగా నేను తరచూ చూసే దృశ్యం ఇది. చిన్నవాడు లేదా యువకుడు పాదాలకు నమస్కరించగానే కొందరు పెద్దలు ఇబ్బందిగా పక్కకు తప్పుకుంటారు. కొందరు నవ్వేస్తారు. ఇంకొందరు ‘‘గాడ్‌ ‌బ్లెస్‌ •••’’ అని హడావిడిగా చెప్పి ఆ క్షణాన్ని ముగించేస్తారు. మరికొందరు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటారు. ఇది వారి తప్పు మాత్రమే కాదు. పాదాభివందనం చేయడం నేర్పాం కానీ, దానికి ఎలా స్పందించాలో నేర్చుకో లేదు. పెద్దల ఆశీర్వాదం కూడా ఒక బాధ్యత అని మనం మరచిపోయాం.</p>
<p>ఆశీర్వదించడం పెద్దల బాధ్యతే</p>
<p>ఆశీర్వాదం అంటే ఆడంబరంగా సంస్కృత పదాలు చెప్పడం కాదు. ఎదుటి వ్యక్తి మంచిని మనస్ఫూర్తిగా కోరడం. ‘‘ఆరోగ్యంగా ఉండు’’, ‘‘నీ ప్రయత్నాలు ఫలించాలి’’, ‘‘మంచి మార్గంలో ఎదుగు’’, ‘‘ఉద్యోగం రావాలి’’, ‘‘సుఖంగా ఉండాలి’’, ‘‘నిన్ను మించి నువ్వే ఎదగాలి’’ అని చెప్పడమే ఆశీర్వాదం.</p>
<p>అలాంటి మాటలు చెప్పడానికి కొన్ని క్షణాలే పడుతుంది. కానీ అవి ఒక పిల్లవాడిలో, ఒక యువతిలో, ఒక ఉద్యోగార్థిలో గొప్ప నమ్మకాన్ని నింపగలవు. ఒక పరీక్షకు బయలుదేరుతున్న బాలుడికి ‘‘ధైర్యంగా రాయి, బాగా రాస్తావు’’ అని పెద్దలు చెప్పడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకుడికి ‘‘నీకు సరైన అవకాశం వస్తుంది’’ అని ప్రోత్సహించడం, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న జంటకు ‘‘సుఖసంతోషాలతో ఉండండి’’ అని దీవించడం వంటివన్నీ మాటలకంటే ఎక్కువ.</p>
<p>సంస్కృతంలో తెలిసినవారు సందర్భానుసారంగా ‘‘దీర్ఘాయుష్మాన్‌భవ’’, ‘‘విజ• భవ’’, ‘‘సుఖీభవ’’, ‘‘ఉద్యోగప్రాప్తిరస్తు’’, ‘‘ఇష్టకార్యసిద్ధిరస్తు’’ వంటి పదాలను ఉపయోగించవచ్చు. కానీ సంస్కృతం తప్పనిసరి కాదు. తెలుగు మాటలో చెప్పిన ఆశీర్వాదానికీ అదే బలం ఉంటుంది. భాష కంటే మనసు ముఖ్యం.</p>
<p>ఈ ఆచారం ఎందుకు చేయాలో యువతరానికి చెప్పకుండా, కేవలం చేయమని చెప్పడం వల్లే అది యాంత్రికంగా మారుతోంది. కొందరు సగం వంగుతారు. కొందరు పాదాలను తాకకుండానే చేతిని అటూ ఇటూ ఊపుతారు. ఇంకొందరు ‘‘చరణ్‌ ‌స్పర్శ్’’, ‘‘‌పాయ్‌ ‌లాగూ’’ అని మాత్రమే అంటారు. మరికొందరు చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు కాబట్టి చేస్తారు. ఇవన్నీ తప్పే అని చెప్పలేం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన పద్ధతి ఉంటుంది. చేతులు జోడించి నమస్కరించడం, తలవంచి పలకరించడం, ఆలింగనం చేసుకోవడం, శ్రద్ధగా వినడం, సేవ చేయడం, మర్యాదగా మాట్లాడటం… ఇవన్నీ గౌరవానికి రూపాలే.</p>
<p>అయితే పాదాభివందనం చేస్తున్నప్పుడు దాని వెనుక భావం ఉండాలి. బంధువులు చూస్తున్నారు కాబట్టి చేసే నాటకం కాకూడదు. ప్రతి ఒక్కరి ముందు, ప్రతి సందర్భంలో, కేవలం వయసు ఎక్కువగా ఉందన్న కారణంతో చేయాల్సిన యాంత్రిక చర్యగా మారకూడదు. వయసు పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులవుతారని చెప్పలేం. దయ, త్యాగం, జ్ఞానం, నైతికత, కుటుంబం పట్ల బాధ్యత- ఇవి ఉన్నప్పుడు ఆ గౌరవానికి నిజమైన అర్థం ఉంటుంది. పాదాభివందనం ఎవరికి పడితే వారికి చేసే హావభావం కాదు. ప్రేమ, ఆప్యాయత, జ్ఞానం, సేవాభావం, నైతిక గౌరవం ఉన్న సంబంధా ల్లోనే దానికి నిజమైన స్థానం ఉంటుంది.</p>
<p>ఇక్కడ మరో తేడా స్పష్టంగా తెలుసుకోవాలి. వినయం వేరు, లొంగుబాటు వేరు. ప్రేమతో తాతమ్మల పాదాలకు నమస్కరించే మనవడు ఒకరు, అహంకారంతో వ్యవహరించే అధికారి ముందు భయంతో వంగే ఉద్యోగి ఇంకొకరు. గురువు ఆశీర్వాదం కోరే విద్యార్థి ఒకరు, తనను తాను గొప్పవాడిగా ప్రకటించుకున్న వ్యక్తి ముందు ఒత్తిడితో నమస్కరించే అనుచరుడు ఇంకొకరు.</p>
<p>ఏ సంప్రదాయవ• గుడ్డి విధేయతను కోరడానికి, ప్రశ్నలను అణచివేయడానికి, కులం లేదా హోదా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఉపయోగ పడకూడదు. తన పాదాలకు నమస్కరిస్తేనే తనను గౌరవిస్తున్నట్టుగా భావించే వ్యక్తి ఈ సంప్రదాయం అసలు అర్థాన్ని గ్రహించలేదని చెప్పాలి.</p>
<p>నిజమైన పెద్దలు గౌరవాన్ని అడగరు, తమ ప్రవర్తనతో సంపాదిస్తారు. పిల్లవాడు పాదాలకు నమస్కరించినప్పుడు ‘‘నా గొప్పతనం గుర్తించాడు’’ అని అనుకోరు. ‘‘ఈ బిడ్డ నా దీవెన కోరుతున్నాడు. నేను ప్రేమతో స్పందించాలి’’ అని భావిస్తారు. ‘‘మమ్మల్ని మించి ఎదుగు’’, ‘‘విజయం వచ్చినా మంచితనం విడువకు’’, ‘‘ఎవరినీ చిన్నచూపు చూడకు’’ అని చెప్పగలిగినప్పుడు పెద్దరికానికి అసలు అర్థం వస్తుంది.</p>
<p>సినీ ప్రముఖుల వేడుకల్లో పాదాభివందనాన్ని సరదాగా మార్చిన వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక నటుడు మరొకరి పాదాలకు నమస్కరించబోతున్నట్లు చేయడం, ఇంకొకరు తప్పించుకోవడం, చుట్టుపక్కలవారు నవ్వడం, చప్పట్లు కొట్టడం ఇప్పుడు సాధారణమైపోయింది.</p>
<p>హాస్యానికి స్థానం ఉంది. కానీ తరాలమధ్య గౌరవానికి ప్రతీకగా ఉన్న ఆచారాన్ని మళ్లీ మళ్లీ చవకబారు వినోదంగా మార్చినప్పుడు, ప్రజల మనసుల్లో దాని విలువ తగ్గిపోతుంది. ఈ ఆచారంలో ఉన్న కృతజ్ఞత, ఆశీర్వాదం, పరస్పర బాధ్యత, అనుభవానికి ఇచ్చే గౌరవం వంటి అంశాలు కనిపించకుండా పోతాయి.</p>
<p>మన సమాజం వేగంగా మారుతోంది. యువతకు కొత్త జ్ఞానం, కొత్త అవకాశాలు, కొత్త ప్రపంచం అందుబాటులో ఉన్నాయి. అది మంచి పరిణామమే. కానీ ఆధునికత అంటే వ•లాలను వదిలేయడం కాదు. అలాగే సంప్రదాయం అంటే స్వేచ్ఛను వదులుకోవడం కూడా కాదు.</p>
<p>యువత ఉత్సాహం, ఊహాశక్తి, ధైర్యం, కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది. పెద్దలు అనుభవం, దూరదృష్టి, జీవిత పాఠాలను అందిస్తారు. ఈ రెండు తరాల మధ్య అనుబంధం బలంగా ఉన్నప్పుడే కుటుంబం బలపడుతుంది; సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది.</p>
<p>వైభవ్‌ ‌సూర్యవంశీ పాదాభివందనం ఎంతో మందిని ఆకట్టుకున్నది అందుకే. అది ప్రదర్శనలా కనిపించలేదు. సహజంగా కనిపించింది. అతని తల్లిదండ్రులు అతనిలో నాటిన వినయం ప్రశంసించ దగ్గది. అదే సమయంలో, ఎవరికి, ఎప్పుడు, ఎంతవరకు గౌరవం చూపాలో గుర్తించే వివేకం కూడా అతనితో పాటు ఎదగాలని ఆశించాలి.</p>
<p>పాదాభివందనం అనే సంప్రదాయాన్ని పూర్తిగా వదిలేయడమో, ప్రశ్నించకుండా ప్రతి రూపాన్ని సమర్థించడమో రెండూ సరైన మార్గాలు కావు. దాని అసలు అర్థాన్ని మళ్లీ నేర్పాలి.</p>
<p>తల్లిదండ్రులు పిల్లలకు ఇది తమను తాము చిన్నచూపు చూసుకోవడం కాదని చెప్పాలి. ఇతరులు తమ కోసం చేసిన సేవను, త్యాగాన్ని గుర్తించే పరిపక్వత అని వివరించాలి. పెద్దలు స్పందించడం నేర్చుకోవాలి. ఆశీర్వాదం ఇవ్వాలి. యువత దీన్ని స్వచ్ఛందంగా, ఆత్మగౌరవంతో, ఎంపికతో ఆచరించాలి.</p>
<p>చిన్నవారు గౌరవాన్ని అందిస్తారు. పెద్దలు దీవెనలు అందిస్తారు. ఆ క్షణంలో ఇద్దరూ మరింత మానవీయంగా మారతారు. పాదాభివందనం వెనుక ఉన్న అసలు పరమార్థం కూడా అదే.</p>
<p>– హరికృష్ణ నిబనుపూడి</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90017/">పాదాభివందనం… పరమార్థం!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90017/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>చరిత్ర పొడవునా…మరణమృదంగం</title>
		<link>https://vskandhra.org/90015/</link>
					<comments>https://vskandhra.org/90015/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 07:00:30 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=90015</guid>

					<description><![CDATA[<p>బాంగ్లాదేశ్‌ ‌హిందువులపై ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులు పునరావృతమయ్యాయి. రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి.  ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీరాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, ఉగ్రవాద అనుకూల ఇస్లామిక్‌ ‌మూకల నుంచి బెదిరింపులు రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గాయిబందాలో జరిగిన ఒక ప్రదర్శనలో దుండగులు శ్రీరాముడి చిత్రపటంపై కాళ్లు పెట్టి అగౌరవపరిచారు. పలాస్‌ ‌బరీలో సుమారు రూ.15కోట్ల 60లక్షల [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90015/">చరిత్ర పొడవునా…మరణమృదంగం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h3>బాంగ్లాదేశ్‌ ‌హిందువులపై ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులు పునరావృతమయ్యాయి. రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి.  ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీరాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, ఉగ్రవాద అనుకూల ఇస్లామిక్‌ ‌మూకల నుంచి బెదిరింపులు రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గాయిబందాలో జరిగిన ఒక ప్రదర్శనలో దుండగులు శ్రీరాముడి చిత్రపటంపై కాళ్లు పెట్టి అగౌరవపరిచారు.</h3>
<p>పలాస్‌ ‌బరీలో సుమారు రూ.15కోట్ల 60లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయం 80శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని, 50 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సనాతన ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించాలని రాధా గోవింద దేవాలయ కమిటీ చాలా కాలంగా శ్రమిస్తున్నది.</p>
<p>ఈ ఘటనపై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ మహాజోత్‌ ‌పిలుపు మేరకు జూన్‌ 19‌న వేలాది మంది విద్యార్థులు, హిందూ ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. తారిఖ్‌ ‌రెహమాన్‌ ‌నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం మైనారిటీల రక్షణలో విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు.</p>
<p>నిందితులపై 72 గంటలలోపు  చర్యలు తీసుకోక పోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ రాముడి విగ్రహ స్థాపనను పునఃప్రారంభించనివ్వకపోతే, బాంగ్లాదేశ్‌ ‌లోని 64 జిల్లాల్లో ఒక్కొక్కటిగా రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్‌ ‌ప్రతిజ్ఞ చేసింది.</p>
<p>పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన రాధాగోవింద దేవాలయ కమిటీ చివరకు ఆలయ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తామని కూడా ప్రకటించింది.</p>
<p>1971లో మొదలైన హిందువుల ఊచకోత నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. బాంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో పాకిస్థాన్‌ ‌సైన్యం, ఇస్లామిక్‌ ‌మిలీషియా ఉమ్మడిగా హిందువులను అత్యంత దారుణంగా హతమార్చారు. చరిత్ర పొడవునా ఈ హత్యాకాండ దఫదఫాలుగా కొనసాగు తూనే ఉంది. అయోధ్య ఉద్యమ సమయంలో 1992లో బాంగ్లాదేశ్‌ ‌వ్యాప్తంగా సుమారు 3వేల ఆలయాలు ధ్వంసమయ్యాయి. హిందువులపై దాడులు, ఆస్తుల దహనం యథేచ్ఛగా కొనసాగాయి. 2001లో పెద్ద ఎత్తున దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగింది. వందల మంది హిందువులు ఈ దాడుల్లో గాయపడ్డారు. 2013-16 మధ్య  వందలాది ఆలయాలను ఇస్లామిక్‌ ‌మూకలు నేలమట్టం చేశాయి. 2021లో దుర్గాపూజ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరిగింది. ఖురాన్‌ను అవమానించారనే అబద్ధపు ప్రచారం నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి. 2024 ఆగస్టులో ప్రధాని షేక్‌ ‌హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత గడచిన రెండేళ్లుగా హత్యాకాండ కొనసాగుతోంది.</p>
<p>ఈ సందర్భంగా రెండు పుస్తకాలను గుర్తు చేసుకోవాలి. తథాగత్‌ ‌రాయ్‌ ‌రాసిన ‘మై పీపుల్‌ అప్‌ ‌రూటెడ్‌’, ‌మరొకటి దీప్‌ ‌హల్దర్‌, అవిషేక్‌ ‌బిస్వాస్‌ ‌రాసిన ‘బీయింగ్‌ ‌హిందూ ఇన్‌ ‌బంగ్లాదేశ్‌’-అన్‌ ‌టోల్డ్ ‌స్టోరీ. ఈ రెండు పుస్తకాలు బాంగ్లాదేశ్‌ ‌హిందువుల దైన్యాన్ని, దాడుల పరంపరను ఎంతో లోచూపుతో చర్చించాయి.</p>
<p>తథాగత్‌ ‌రాయ్‌ ‌రాసిన ‘మై పీపుల్‌ అప్‌ ‌రూటెడ్‌’ ‌పుస్తకంలో నాటి ఊచకోత ఉదంతాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒడియా మాట్లాడే హిందువులపై జరిగిన మారణకాండను చదివితే ఎవరికైనా గుండెలు మండిపోతాయి. దేవీ దేవతలు కొలువైన ప్రతి ఇంట్లో మరణమృదంగం మోగింది. సిందూరం పెట్టుకున్న ప్రతి స్త్రీ అత్యాచారానికి గురైంది. హంతకులంతా యువకులు. ముసీం లీగ్‌ ‌నినాదాలిస్తూ.. మందలు మందలుగా హిందువులపై పడ్డారు. ఓ బెంగాలీ హిందూ కుటుంబం భీతితో పారిపోయేందుకు రైల్వే స్టేషన్‌లో కూర్చున్నది. జిహాద్‌ మూకలు వీరిని చూడగానే పరిగెత్తుకొచ్చి చుట్టుముట్టాయి. కుటుంబంలోని పదిహేనేళ్ల బాలిక మూకను చూడగానే చేష్టలుడిగి కూర్చున్నది. బాలికను బలవంతంగా లేపి నిలబెట్టి వివస్త్రను చేశారు. పట్టపగలు నడిరోడ్డున అలాంటి స్థితిని ఎదుర్కొన్న బాలిక మానసిక స్థితి ఏమై ఉంటుందో ఊహించుకో వచ్చు.</p>
<p>రాయ్‌ ‌సాహెబ్‌ ‌నాగేంద్ర కుమార్‌ ‌సుర్‌ 1946 ‌ప్రాంతంలో నౌఖాలీ జిల్లాకు చెందిన  ప్రముఖ న్యాయవాది. పాకిస్థాన్‌ అనుకూల అల్లర్లు చెలరేగిన సమయంలో ఆయనను ముస్లీంలీగ్‌ ‌మూకలు అపహరించాయి. మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి….నీ సమాధి నువ్వే తవ్వుకో.. పూడ్చిపెడతా మంటూ ఆదేశించారు. రాయ్‌ ‌సాహెబ్‌ ఏమాత్రం భయపడకుండా ‘నన్ను మీరెలాగూ చంపుతున్నప్పుడు మీమాట వినడంలో అర్థం లేదన్నారు. హంతక మూకలు రాయ్‌ ‌సాహెబ్‌ ‌మరో హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత దుండగులు ఆయన తల నరికివేశారు. రావు సాహెబ్‌ ‌కుమారుడు అక్కడి నుంచి పారిపోయి కలకత్తాకు వచ్చాడు. రావు సాహెబ్‌ ‌కుమారుణ్ని రచయిత తథాగత్‌ ‌రాయ్‌ ‌సంప్రదించే నాటి సంఘటనల గురించి వాకబు చేసే ప్రయత్నం చేస్తే…వాటిని గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుందన్నారట.</p>
<p>నౌఖాలీ జిల్లా కరవు బారిన పడిన రోజుల్లో హిందువులు రోజంతా ఆహారం కోసం తిరిగి తిరిగి రాత్రి కాగానే మార్కెట్‌ ‌ప్రాంతంలోనో లేదో వీధుల్లోనే నిద్రించేవారట. ఉదయం లేచే సరికి కొంతమంది ఆకలిచావుకు గురయ్యేవారట. చనిపోయినవాళ్లు ముస్లింలా హిందువులా అని తనిఖీ చేసిన తర్వాత వారు ముస్లింలు అయితే జనాజా నమాజ్‌ ‌చేసి ఖననం చేసేవారట. హిందువులైతే వారి శవాలను నదుల్లో చేపలకు, పీతలకు ఆహారంగా వేసి ఆనందించేవారట. తూర్పుబెంగాల్‌లోని డెల్టా ప్రాంతంలో చిన్న వృత్తు చేసుకుంటూ జీవనం సాగించే చాలామంది  ముస్లిం మూకలు తమ స్త్రీలను పెళ్లి చేసుకోవడం అనివార్యమనుకునే రోజుల్లో తమ ప్రాణాలకంటే తమ గృహిణుల రక్షణ విషయంలో చాలా భయపడేవారని రచయిత తన పుస్తకంలో రాశారు.</p>
<p>దేశ విభజన సమయంలో బాంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లా 1950లో హిందూ మెజారిటీ జిల్లా. విభజన ఖరారైన తర్వాత ఖుల్నాను పాకిస్థాన్‌కు ఇచ్చి ముస్లింమెజారిటీ జిల్లా అయిన ముర్షీదాబాద్‌ను భారత్‌ ‌కు అప్పగించారు. ఆ తర్వాత ఖుల్నా జిల్లాలోని హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఈ హంతక దాడుల్లో హిందువులంతా చెల్లాచెదురయ్యారు.</p>
<p>నాటి పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవడానికి తథాగతా రాయ్‌ ‌వాస్తవ ఘటనల ఆధారంగా వెలువడిన ‘లొజ్జా’ అనే నవల కథను క్లుప్తంగా ప్రస్తావించారు. వాస్తవ ఘటనల ఆధారంగా రాసిన ఈ నవల ఇతివృత్తమంతా భీతిగొలిపేది. 1952లో ఢాకాలోని లైటన్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో సుధామయి సహధ్యాయులందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సుధామయి సైతం తన మెడికల్‌ ‌డిగ్రీ తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రులు హెచ్చరిస్తూ ఇది ముస్లింల మాతృభూమి. ఇక్కడ మనకెలాంటి భద్రత ఉండదు. అది గుర్తుంచుకో. లేదంటే తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నారు.</p>
<p>సుధామయి సహా ఆయన తండ్రి ఈ సూచనను ఖాతరు చేయలేదు. డాక్టర్‌ ‌పట్టా పుచ్చుకుని మైమెన్‌ ‌సింగ్‌ ‌పట్టణానికి సుధామయి వెళ్లిపోయాడు. ఎస్‌.‌కే.ఆసుపత్రిలో ఉద్యోగంతో పాటు స్వదేశీ బజార్‌లో ప్రైవేట్‌ ‌ప్రాక్టీసు ప్రారంభించాడు. బ్రాహ్మణ బరియాకు చెందిన ఓ న్యాయవాది కూతురైన కిరణ్మయిని పెళ్లిచేసుకున్నాడు. అందరూ భారత్‌ ‌వెళ్లిపోతున్నా సుధామయి మాత్రం బాంగ్లాదేశ్‌ ‌వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. 1971లో పాకిస్థాన్‌ ‌సైన్యం దాడి చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.</p>
<p>ఓ రోజు రాత్రి సుధామయిని ముగ్గురు పాకిస్థానీ సైనికులు బంధించారు. పేరడిగారు. భయం భయంగా సిరాజుద్దీన్‌ ‌హుస్సేన్‌ అన్నాడు. తడబాటును గ్రహించిన పాకిస్థానీ సైనికులు ప్యాంటు విప్పమన్నారు. ముస్లిం కాదని గ్రహించిన తర్వాత ఓ కాలు విరిచేశారు. మరో ఇద్దరు సైనికులు డొక్కల్లో తన్నారు. అక్కడి నుంచి లాక్కెళ్లి క్యాంపులో వేశారు. విపరీతంగా కొట్టడంతో పాటు మూత్రం తాగించారు. కల్మా చదవాలని బలవంతపెట్టారు. మతం మార్చుకోవాలంటూ హింసించారు. ఆరేడు రోజుల తర్వాత పాకిస్థానీ సైనికులు సుధామయి పురుషాంగాన్ని కోసేసి, నాలాలోకి విసిరేశారు. క్యాంప్‌లోని మిగతా వాళ్లు ఈ ఘటనను చూసిన తర్వాత తామంతా ముస్లిం మతం స్వీకరిస్తామని పాకిస్థానీ సైనికులను ప్రాధేయపడ్డారు. నిర్దాక్షిణ్యంగా వారందరినీ సైనికులు హత్య చేశారు.</p>
<p>దీప్‌ ‌హల్దర్‌, అవిషేక్‌ ‌బిస్వాస్‌ ‌రాసిన ‘బీయింగ్‌ ‌హిందూ ఇన్‌ ‌బాంగ్లాదేశ్‌-అన్‌ ‌టోల్డ్ ‌స్టోరీ’ పుస్తకంలో ఏముందో తెలుసుకుందాం. చరిత్ర భారాన్ని సాంతం ఆర్ధ్రంగా ప్రయాసపడి కుదిస్తే ఎలా ఉంటుందో చెప్పాలంటే ‘బీయింగ్‌ ‌హిందూ ఇన్‌ ‌బాంగ్లాదేశ్‌-అన్‌ ‌టోల్డ్ ‌స్టోరీ’ పుస్తకం గురించి మాత్రమే చెప్పాలి. ఎనిమిది దశాబ్దాలుగా బాంగ్లాదేశ్‌ ‌హిందువులు మోస్తున్న గాయాల గతాన్ని తడుముతుందీ పుస్తకం. పుస్తకం వెంటాడే వాక్యాలతో మొదలవుతుంది.</p>
<p>90 ఏళ్ల స్మృతికాంత బిస్వాస్‌ ‌హిందువుల ఊచకోతలకు ప్రత్యక్ష సాక్షి. ఆయనను ఇంటర్వ్యూ చేశారు రచయితలిద్దరూ. తప్పుడు వార్తలు వ్యాపించగానే పొరుగువారే అల్లరిమూకలుగా, హంతకులుగా మారి హిందులపై నరమేధానికి పాల్పడిన ఉదంతాలను రచయితలు ఎంతో ఆర్ధ్రంగా రాశారు. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి సోదరిని అల్లరిమూకల బారినుండి కాపాడేందుకు ఏం చేశారో స్మృతికాంత బిస్వాస్‌ ‌చెప్పడంతో పుస్తకం ఆరంభమవుతుంది.</p>
<p>ఆ తర్వాత జనాభా నిష్పత్తిలో వచ్చిన తీవ్రమైన మార్పులను పుస్తకం చర్చిస్తుంది. 1947లో ముప్ఫైశాతం హిందు జనాభా ఉంటే 9శాతానికి పడిపొయిన తీరును, సంపన్న హిందువులు సైతం తమ ధార్మిక విశ్వాసాలను వ్యక్తం చేసేందుకు జంకిన గతాన్ని, బెంగాలీ దళిత నాయకుడు జోగేంద్రనాథ్‌ ‌మండల్‌ ‌చారిత్రక పాత్రను, దేశ విభజన సమయంలో ముస్లింలీగ్‌ను సమర్థించి తర్వాత పశ్చాత్తాపపడిన తీరును చర్చిస్తుంది.</p>
<p>మొత్తంగా ఎనభై ఏళ్లుగా సాగుతున్న బాంగ్లాదేశ్‌ ‌హిందువుల ఊచకోతలో చరిత్రకెక్కని హృదయ విదారక గాథలెన్నో ఉన్నాయి. 2021 నుంచి ఆరేళ్లుగా ఇది మరింత తీవ్రమైంది. 2024లో అధికార మార్పిడి తర్వాత దాడుల తీవ్రత పెరిగింది. భారత ప్రభుత్వం బాంగ్లాదేశ్‌ ‌హిందువుల గురించి అవసరమైన చర్యలు తీసుకోవాలంటే అందుకు సాంకేతికమైన అవరోధాలున్నాయి. వారంతా బాంగ్లాదేశ్‌ ‌పౌరులు కావడం ప్రథమ అవరోధం. దీన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో తిరిగి షేక్‌ ‌హసీనా ప్రభుత్వం ఏర్పడితే అప్పుడేమైనా బాంగ్లాదేశ్‌ ‌హిందువులకు ఉపశమనం-ప్రాణాలకు హామీ లభిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.</p>
<p>‌ప్రశాంత్‌ ‌జోషి<br />
సీనియర్‌ ‌జర్నలిస్ట్</p>
<div class="media mg-info-author-block"></div>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/90015/">చరిత్ర పొడవునా…మరణమృదంగం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/90015/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>బానిసత్వ పాపానికి క్షమాపణ సరిపోతుందా?</title>
		<link>https://vskandhra.org/89975/</link>
					<comments>https://vskandhra.org/89975/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Yugandhar]]></dc:creator>
		<pubDate>Tue, 07 Jul 2026 08:00:20 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=89975</guid>

					<description><![CDATA[<p>ఐరోపా శ్వేతజాతి దేశాలు విస్తరించిన వలసవాద సామ్రాజ్యం, వారు సాగించిన క్రూరమైన బానిసత్వ వ్యవస్థ ప్రపంచ చరిత్ర పుటల్లో ఎన్నటికీ చెరిగిపోని ఒక నిలువెత్తు నల్లటి అధ్యాయం. మానవ ప్రగతి ప్రయాణంలో తాము మాత్రమే నాగరికులమనే అహంకారంతో, ‘శ్వేతజాతీయుల భారం’ (Whiteman’s Burden) అనే కపట సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టారు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ కోసం ఆఫ్రికా, ఆసియా ఖండాల సంపదను నిలువునా దోచుకోవడమే [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/89975/">బానిసత్వ పాపానికి క్షమాపణ సరిపోతుందా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>ఐరోపా శ్వేతజాతి దేశాలు విస్తరించిన వలసవాద సామ్రాజ్యం, వారు సాగించిన క్రూరమైన బానిసత్వ వ్యవస్థ ప్రపంచ చరిత్ర పుటల్లో ఎన్నటికీ చెరిగిపోని ఒక నిలువెత్తు నల్లటి అధ్యాయం. మానవ ప్రగతి ప్రయాణంలో తాము మాత్రమే నాగరికులమనే అహంకారంతో, ‘శ్వేతజాతీయుల భారం’ (Whiteman’s Burden) అనే కపట సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టారు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ కోసం ఆఫ్రికా, ఆసియా ఖండాల సంపదను నిలువునా దోచుకోవడమే కాకుండా, అక్కడి స్థానిక ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పూర్తిగా నాశనం చేశాయి.</p>
<p>ఆఫ్రికన్ల బానిసత్వం – భారత్‌పై దోపిడీ: పదహారవ శతాబ్దం నుండి ఆఫ్రికన్లను పశువుల కంటే హీనంగా వేటాడి అమెరికాకు తరలించారు. అలెక్స్ హేలీ రాసిన ‘రూట్స్’ నవలలోని ‘కుంట కింటే’ పాత్ర ద్వారా ఈ అణచివేత ప్రపంచానికి తెలిసింది. అమెరికాలో బానిసత్వం రద్దయినా వర్ణవివక్ష కొనసాగగా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ “ఐ హావ్ ఎ డ్రీమ్” ఉద్యమంతో పౌర Hక్కులను సాధించారు. అటు బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్ డాలర్ల సంపదను లండన్‌కు తరలించి, 1943 బెంగాల్ కరవు ద్వారా 30 లక్షల మంది మరణానికి కారణమైంది. ఆ తర్వాత ‘గిర్మితియా’ (ఒప్పంద కార్మికులు) పేరుతో లక్షలాది భారతీయులను పరాయి దేశాలకు తరలించి శ్రమదోపిడీ చేశారు.</p>
<p>వాటికన్ కుట్రలు – పోప్ లియో XIV చారిత్రాత్మక వ్యాఖ్యలు: ఈ సుదీర్ఘ సాంస్కృతిక విధ్వంసానికి, దోపిడీకి దైవకృప పేరిట ‘పాపల్ బుల్స్’ (పోప్ అధికారిక ఉత్తర్వులు) ద్వారా చట్టబద్ధత కల్పించింది వాటికన్ రోమన్ క్యాథలిక్ చర్చ్. స్థానిక సంస్కృతులను ‘సాతాను సంస్కృతులు’గా చిత్రీకరిస్తూ సాగించిన ఈ మహాపాపాన్ని చర్చి శతాబ్దాల పాటు కప్పిపుచ్చుకుంటూ వచ్చింది.</p>
<p>అయితే, ఇటీవల ప్రస్తుత పోప్ లియో XIV (14) తన తొలి అధికారిక బోధనా పత్రం (‘Magnifica Humanitas’) ద్వారా ఈ చారిత్రాత్మక నేరాన్ని బహిరంగంగా అంగీకరిస్తూ క్షమాపణలు కోరారు. గతంలో చర్చి అధిపతులు వలసవాదానికి, మానవ అక్రమ రవాణాకు, శారీరక-مانసిక బానిసత్వానికి ఏ విధంగా మతపరమైన లైసెన్స్ ఇచ్చారో ఆయన ఈ పత్రంలో స్పష్టంగా ప్రస్తావించారు. చర్చి చరిత్రలో జరిగిన ఈ క్రూరత్వాన్ని “మానవత్వానికి జరిగిన తీరని ద్రోహం” గా ఆయన అభివర్ణించారు. కానీ, ఇదే పత్రంలో ఆయన కృత్రిమ మేధస్సు (AI) డిజిటల్ యుగంలో “కొత్త బానిసత్వాలకు” దారితీస్తుందని ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం గమనార్హం.</p>
<p>క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఇక్కడ మిగిలిపోయే ప్రధాన ప్రశ్న ఏమిటంటే—శతాబ్దాల పాటు సాగిన క్రూరమైన అణచివేత, కోట్ల మంది ప్రాణాల బలి, సంస్కృతుల విధ్వంసం కేవలం కొన్ని క్షమాపణ పదాలతో చెరిగిపోతాయా? చర్చి కేవలం ఒక ప్రకటనతో తన బాధ్యత నుండి తప్పుకుంటే సరిపోతుందా? వలస దేశాల నుండి దోచుకున్న అపార సంపదతో నిర్మించుకున్న నేటి ఆధునిక ఐరోపా వైభవం, వాటికన్ సామ్రాజ్యం వెనుక కోట్ల మంది ఆఫ్రికన్లు, భారతీయుల రక్తం, శ్రమ దాగి ఉన్నాయి. చర్చి ఆనాడు ఇచ్చిన మతపరమైన లైసెన్స్ వల్లే తరాల తరబడి మానవ హక్కుల హననం జరిగింది. కాబట్టి, ఈ చారిత్రాత్మక గాయాలు కేవలం మాటల క్షమాపణలతో పూడేవి కావు; ఆయా నష్టపోయిన సమాజాలకు నిజమైన న్యాయం, పరిహారం దక్కినప్పుడే ఈ నల్లటి అధ్యాయానికి పూర్తి ముగింపు దక్కుతుంది.</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/89975/">బానిసత్వ పాపానికి క్షమాపణ సరిపోతుందా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/89975/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
