ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన, రక్తదానం, రక్తపరీక్షలు వంటి వైద్య సేవాలను అందించడం జరిగింది. నంద్యాల నగరం సుంకులమ్మ ఉపనగరం సేవా బస్తి ఆజాద్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యుల నేతృత్వంలో రక్త పరీక్షలు నిర్వహించారు. మందులు అందించారు.
విశాఖపట్నంలో డా. పీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విశాఖ సేవా విభాగ్ ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి 43 మందికి తగు పరీక్షలు నిర్వహించారు. అలాగే సేవా సప్తాహంలో భాగంగా స్థానికంగా ఉన్న దేవాలయాన్ని శుభ్రపరిచారు. విద్యార్థినీవిద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు వృద్ధులకు పండ్లు, రొట్టెలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ్ శ్రీ అతుల్ లిమయే, ప్రాంత ప్రచారక్లు, విభాగ్ కార్యవాహ్లు, సర్కార్యవాహ్లు, జిల్లా సేవా ప్రముఖ్లు, నగర సేవా ప్రముఖ్లు, స్వయంసేవకులు పాల్గొన్నారు.
9
You Might Also Like
రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత
వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం...
ఆలయాలే వీరి టార్గెట్
20
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ...
తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..
24
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్-తిరుపతి-...
రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు
అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్...
అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా
21
గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి... విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి...
క్రైస్తవంలోకి మారిన వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసిన ప్రభుత్వం
28
క్రైస్తవ మతంలోకి మారిన టి. లక్ష్మణరావు, అతని కుటుంబానికి జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం...