తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే పార్థసారథి ర్యాలీని ప్రారంభించారు. వందలాదిమంది. హిందువులు, భక్తులు నినాదాలు చేశారు. భీమస్ కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీటీడీని దేవదాయ శాఖ నుంచి తొలగించి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ప్రకటించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ర్యాలీలో కల్లుమఠం పీఠాధిపతి గురుసిద్ద లింగ దేవరు, సుబ్రహ్మయ్యం భారతి (మైసూరు) అయోధ్య నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ, బీజేపీ నాయకులు కునిగిరి నీలకంఠ, విట్టా రమేష్, జనసేన ఇన్చార్జి మల్లప్ప, శ్రీనివాస ఆచారి, చెన్న బసప్ప, ఈరన్న రావు, కొంగే పంపావతి పాల్గొన్నారు
23
You Might Also Like
అట్టహాసంగా సింహపురి వైద్య సేవా సమితి ‘‘బాలమేళా’’
స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగాలు, ధైర్య సాహసాలు భావితరాలకు ఆదర్శనీయమని ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ అన్నారు. వనవాసి సమాజాన్ని మిగిలిన సమాజం...
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ
3
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పది రోజులపాటు కనకదుర్గా అమ్మవారు...
ఆరెస్సెస్ పథసంచలన్కి మద్రాసు హైకోర్టు అనుమతి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 58 ప్రాంతాల్లో నిర్వహించే పథ సంచలన్ కి (రూట్ మార్చ్) మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే అనుమతులు ఇవ్వాలని...
రాష్ట్రవ్యాప్తంగా ‘‘సేవా సప్తాహం’’
ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర...
ఆంజనేయస్వామి మూలవిరాట్ అపహరణ
57
శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత...
దసరా పండుగ విశిష్టత ఇదీ!
( దసరా ప్రత్యేకం) ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...