News

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హమీద్ అలీకి 20ఏళ్ళ ఖైదు

23views

త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లా కైలా షహర్‌ నివాసి అయిన 70 ఏళ్ళ హమీద్ అలీకి జిల్లా సెషన్స్ జడ్జి 20ఏళ్ళ జైలు శిక్ష, రూ 20వేల జరిమానా విధించారు. ఆరేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి అతనికి ఈ శిక్ష పడింది.

2023 జూన్ 4న హమీద్ అలీ ఒక ఆరేళ్ళ బాలికను అడవిలోకి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సంఘటన గురించి ఫిర్యాదు చేసిన నెల రోజుల లోపలే దర్యాప్తు పూర్తిచేసి నిందితుణ్ణి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారణలో 16మంది సాక్షులు అలీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.

నేర తీవ్రతను బట్టి, పటిష్టమైన సాక్ష్యాధారాలను బట్టి ఈ కేసులో నేరస్తుడి పట్ల ఎలాంటి కనికరమూ చూపించే అవకాశమే లేదని న్యాయమూర్తి అంశుమన్ దేవ్ వర్మ చెప్పుకొచ్చారు.