News

అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు : టీటీడీ

26views

అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయనుంది. హిందూయేతరులు తిరుమల వచ్చినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను ఆ బోర్డుల్లో వివరించనున్నారు.