News

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం

27views

రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయానికి గొప్ప విశిష్టత లభించింది. జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఈ క్షేత్రం గుర్తించబడింది.2024 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీలో 8 విభాగాలలో కేంద్ర పర్యాటక శాఖ 36 గ్రామాలను విజేతలుగా ప్రకటించింది. స్పిరిచువల్ వెల్ నెస్ విభాగంలో అహోబిలం క్షేత్రం విజేతగా నిలిచింది. డిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ సంబంధిత జిల్లా అధికారులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రతినిధి, ఇంటాచ్‌ నంద్యాల చాప్టర్‌ కన్వీనర్‌ శివకుమార్‌రెడ్డి అందుకున్నారు.