News

28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు

28views

అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సనాతన ధర్మం, దేవాలయాల పురోగతి పరిరక్షణ బాధ్యతలు, భారతీయ సంస్కృతి తదితరాల గురించి సదస్సులో చర్చ ఉంటుందన్నారు. శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలవుతుందన్నారు. రాజంపేటకు చెందిన స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ పసుపులేటి శంకర్‌చే ఆధ్యాత్మిక ఉపన్యాసం ఉంటుందన్నారు.