విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమములు నిర్వహించుటలో భాగంగా దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తముగా నిర్వహించారు.కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే దేవస్థానంలో పవిత్రోత్సవములు నిర్వహించడం జరిగినదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వ పదార్థముల దోషములన్నీనివారణ అయ్యి, శాంతి పొందుటకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్ సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నయమ్మ, జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామన్నారు.
34
You Might Also Like
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
17
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
19
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....
అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర
21
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి...
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
18
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
28
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...
భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్
(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్ భగత్సింగ్. కిషన్సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్...