News

సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం

22views

సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్‌కే కళా సంస్కృతి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రంజిత్‌ ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 45 మంది కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. భరతనాట్యం, కూచిపూడి, పేరణి, ఆంధ్ర నాట్యం, కవితలు, పద్యాలు, పౌరాణిక ప్రదర్శన, గేయాలు నిర్వహించిన దృశ్యాలు ప లువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీతారామిరెడ్డి మాట్లాడుతూ పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రోత్సాహించాలన్నారు. అనంతరం కళాకారులను శాలువ, జ్ఞాపిక, పుష్పమాలలతో సన్మానించారు.