దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 17 నుంచి 20వతేదీ(శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో దేవస్థానంలో అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి అలంకారం చేశాక శాస్ర్తోక్తంగా వేదమంత్రాల మధ్య పవిత్రమాలలను ధరింపజేస్తారు. 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాయశ్చిత విధి, వివిధ దేవతారాధనలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి మూల మంత్రహవనాలు, వేద పారాయణలు, హారతి, మంత్రపుష్పం సమర్పిస్తారు. 19వ తేదీన మండ పారాధన నిర్వహిస్తారు. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మండపా రాధన, సర్వప్రాయశ్చిత విధి, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండ బలి నిర్వహించాక 10.30 గంటలకు కలశోద్వాసన, మార్జనం, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18వ తేదీన స్నపనాభిషేక కార్యక్రమం సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు.
47
You Might Also Like
అక్టోబర్ 3 నుంచి.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న...
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హమీద్ అలీకి 20ఏళ్ళ ఖైదు
13
త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లా కైలా షహర్ నివాసి అయిన 70 ఏళ్ళ హమీద్ అలీకి జిల్లా సెషన్స్ జడ్జి 20ఏళ్ళ జైలు శిక్ష, రూ 20వేల...
వచ్చే నెల 1,2, తేదీల్లో జనజాతి సమ్మేళనం
18
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విజయనగరంలో అక్టోబర్ 1, 2 తేదీలలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎ....
అస్సాంలో ఘర్వాపసీ: సనాతన ధర్మంలోకి తిరిగొచ్చిన రెజీనా బేగం
19
స్సాంలో ఓ ముస్లిం యువతి సనాతన ధర్మంలోకి తిరిగొచ్చింది. ఇస్లాంను వదిలిపెట్టి ఘర్వాపసీ అయింది. నగావ్లోని శ్రీశ్రీ జఖలబంధ సత్రంలో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం...
జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం
27
రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయానికి గొప్ప విశిష్టత లభించింది. జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక...
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
27
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి...