బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్టులు చెలరేగిపోతున్నారు. రిజర్వేషన్ల ఆందోళనల ముసుగులో హిందువులపై అమానవీయ దురాగాతాలకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులకు నిప్పుపెడుతున్నారు. హిందువులపై వారి దర్శనీయ స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. హిందువులపై జరిగిన దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడాలని జమాతే ఇస్లామీ పార్టీ ప్రజల్ని రెచ్చగొడుతోంది. తాజాగా ఇండియన్ కల్చరల్ సెంటర్ను ధ్వంసం చేసిన రాడికల్స్ ఢాకాలోని తీరత్సింగ్ సయీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వ సహకారంతో ఇటీవలే అక్కడ నెలకొల్పారు. ఖాసీ పర్వత ప్రాంతానికి చెందిన తీరత్ సింగ్ సయీమ్ అవిభక్త భారతదేశపు స్వాతంత్ర్య సమరయోధుడు. తీరత్ సింగ్ విగ్రహ ధ్వంసం పై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
51
You Might Also Like
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
2
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
10
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
14
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
18
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
28
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
25
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....