డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి మూలవిరాట్ దర్శనాలకు ఈ నెల 7 నుంచి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు విలేకర్లకు ఈ విషయం తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యాన మూలవిరాట్ జీర్ణోద్ధరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వీటిని పూర్తి చేసిన అనంతరం ఈ నెల 5 నుంచి 7 వరకూ సంప్రోక్షణ, విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. 5న కళావాహన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, కుచ్చత్రయం, మండపారాధన, రుత్విక్ వరుణలు, దీక్షధారణ, కృష్ణ యజుర్వేద పారాయణ, గణపతి హోమం, వాస్తు హోమం, చతుర్వేద స్వస్థి నిర్వహిస్తామని వివరించారు. 6న గణపతి పూజ, పుణ్యాహవాచనం, కుచ్చత్రయం, పునఃపూజలు, ఉదయ శాంతి, శతరుద్ర, శ్రీసూక్త, దుర్గా సూక్త, శుక్ల యజుర్వేద పారాయణలు, రుద్ర, చండీ హోమాలు, చతుర్వేద స్వస్తి జరుగుతాయన్నారు. ఏడో తేదీన గణపతి పూజ, పునఃపూజలు, రుగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవతార్చనలు, కుంభాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం ఉదయం 9.34 గంటలకు కళావాహన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉదయం 11.05 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈఓ తెలిపారు.
47
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
101
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
30
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
31
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
29
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
39
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
43
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....