News

బాపు మ్యూజియంను సందర్శించిన యూఏఈ రాయబారి

41views

భారతదేశంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నస్సీర్ జమాల్ బుధవారం విజయవాడ గవర్నర్ పేటలోని బాపు మ్యూజియంను సందర్శించారు. పురావస్తు, మ్యూజియం శాఖల కమిషనర్ జి.వాణిమోహన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మ్యూజియం విశిష్టతను ఆయనకు వివరించారు. అబ్దుల్ నస్సీర్.. పింగళి వెంకయ్య గ్యాలరీలో లేజర్ షోను తిలకించారు. అలనాడు విక్టోరియా మ్యూజియంగా పిలిచే దీనిలో.. జాతీయ జెండాను రూపొందించి మహాత్మాగాంధీకి అందించడం.. తదితర అంశాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బుద్ధిజం, జైనిజం, ప్రాచీన చారిత్రక గ్యాలరీ, హిందూ శిలా గ్యాలరీ, పురాతన నాణేలు, ఆయుధాలు తదితరాలను పరిశీలించారు.