కాకినాడ నగరంలో పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్ మన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. స్థానిక జేఎన్టీయూ ప్రాంగణంలోని సెనేట్ హాలులో యూనివర్సిటీ మరియు పీపుల్స్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రాట్ (కరువు) అండ్ ఫ్లడ్ (వరద), పీడబ్ల్యూసీడీఎఫ్ సంస్థల సంయుక్త ఆధ్యర్యంలో వారసత్వ సంపద భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై నగర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తీర ప్రాంతాలన్నీ భాగమని, వాటిని ప్రజలు రక్షించుకోవాలన్నారు. నీటి కొరత, నదుల ప్రక్షాళన, నదులు, భూమిలోని నీటిని సంరక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కాకినాడ వారసత్వ నగరంగా వెలుగొందుతుందని, ఇక్కడ మూడు రకాల వారసత్వ సంపదలు ఉన్నాయన్నారు. అవి పురాతన కళాశాలలు, జాతీయ వారసత్వ సంపద, మడ అడవులు అన్నారు.
48
You Might Also Like
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
2
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
22
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...
భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్
(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్ భగత్సింగ్. కిషన్సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్...
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం
28
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు...
తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!
-డాక్టర్ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి...
ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్పి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి...