నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ప్రారంభించిన ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం సానుకూల ఫలితాలను అందిస్తోంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల వాసులు బాధ్యతగా కృషి చేస్తున్నారు. స్థానిక పద్మావతినగర్లోని శ్రీకృష్ణ మందిరంలో సంఘమిత్ర సేవా సమితి ఏర్పాటు చేసిన 4వ చైతన్య సదస్సులో పట్టణవాసులు తమ విజయాలను పంచుకున్నారు.
తమ ఫంక్షన్ హాలులో జరిగే పెళ్లిళ్ళు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని సంఘమిత్ర క్రియాశీలక సభ్యులు, జయంతా వెజ్ వరల్డ్ నిర్వాహకులు సముద్రాల నాగ రాజయ్య తెలిపారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులను వాడడం లేదని తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నామని..ఇది తమకు ఎంతో ఆనందకరంగా ఉందని ఆయన తెలిపారు.
శ్రీ కృష్ణ మందిరం నిర్వాహకులు సైతం ప్లాస్టిక్ రహిత జీవనం వైపు మళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా, తమ మందిరంలో జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 600 మందికి పైగా భక్తులు పాల్గొంటారని..ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సదస్సులో పాల్గొన్న మహిళలు తమ అపార్ట్మెంట్లలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీలు గ్లాసులు, ప్లేట్లను ఉమ్మడిగా సమకూర్చుకున్న విషయాన్ని సభికుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనారతో తయారు చేసిన సంచులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుల్లో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు పృథ్వీరాజ్ యాదవ్, శ్రీ కృష్ణ మందిరం కమిటీ సభ్యులు, పలువురు పర్యావరణ ప్రేమికులు, మాతృమూర్తులు పాల్గొన్నారు.
74
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
31
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
24
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
32
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
27
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
32
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...