News

వేద సంరక్షణకు కృషి చేయాలి

65views

వేద సంరక్ష ణకు కృషి చేయాలని ఆధ్యాత్మికవేత్త విశ్వనాథ గోపాల అన్నారు. శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న అభినవ శంకర విజయం వివరణాత్మక భాషణం ఆధ్మాత్మిక ప్రసంగం ముగిసింది.ఈ సందర్భంగా గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ నృసింహభారతి స్వామి ధర్మ స్థాపనలో తమదైన కృషితో జాతిని ప్రభావితం చేసిన మహనీయుడన్నారు. ధర్మ సంరక్షణకోసం శారదా పీఠం నిరంతరం కృషి చేస్తునట్లు తెలిపారు. నృసింహభారతి మహాస్వామి 33 వ పీఠాధిపతిగా శృంగేరీ పీఠాధిపత్యం స్వీకరించినట్లు తెలిపారు. ఆయన నిరంతరం తపోధ నుడని అన్నారు. వేదాలు పురాణాలు, ఉపనిషత్తులు భారత దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నట్లు తెలిపారు. ముగింపు శివరామ కృష్ణక్షేత్ర ధర్మాధికారి నిర్వహించారు.