దేశంలో తూర్పు నదీ తీర పరీవాహక ప్రాంతంలో నెలకొన్న మడ అడవులు(మాంగ్రూవ్స్) జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశంలో కోల్కతాలోని సుందర్బన్స్ తరువాత కోరంగి మడ అడవులు రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించారు. కోరంగిలోని మడ అడవులు కాకినాడలోని పగడాలపేట వద్ద ప్రారంభమై తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలం పండి, పోర, ఎస్.యానాం వరకు దాదాపు 75 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి నది గౌతమి, వైనతేయ, వశిష్ఠ పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసే తీర ప్రాంతంలో ఈ మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆయా నదుల నుంచి నీరు సముద్రంలో కలిసే ప్రాంతంలో మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. మడ అడవులు ప్రత్యక్షంగా పశుగ్రాసం, వంట చెరకు వంటి ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు పరోక్షంగా మత్స్యసంపద అందిస్తాయి. తుపానులు, వరదల నుంచి తీర ప్రాంత గ్రామాలకు, ప్రజలకు రక్షణ చేకూరుస్తున్నాయి. ఇక్కడి మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అనేక జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. దూర తీరాల నుంచి వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు, ఫిషింగ్ క్యాట్, ఇండియన్ స్మూత్ కోటెడ్ ఓటర్స్ ఆవాసంగా ఉంటాయి. కాలుష్యం, భూమి కోత, తుపాను తాకిడి, అడవులు నరికివేసి చేపలు, రొయ్యలు చెరువులు తవ్వడం వంటి చర్యల వల్ల మడ అడవులు క్రమేణా తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం పర్యావరణ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసింది. మడ అడవులపై ఆధారపడకుండా సమీప గ్రామస్తులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యకలాపాలను అందిస్తున్నారు. మడ అటవీ సంపదను కాపాడేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం కోరంగి బయో డైవర్సిటీ సెంటర్లో నిర్వహించిన వరల్డ్ మంగ్రూవ్స్ డే కార్యక్రమానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
45
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
24
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
20
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
28
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
21
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
25
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...