ఐఆర్సీటీసీ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు –ఎస్సీజెడ్బీజీ27’ని నడుపుతున్నారని.. ఆగస్టు 4 నుంచి 12వ తేదీ వరకు ‘సప్త జ్యోతిర్లింగ దివ్యదర్శన్ యాత్ర’ ప్రారంభం కానుందని తిరుపతి పరిసర జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ సంయుక్తంగా తెలిపారు. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం వంటి 7 క్షేత్రాలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు యాత్ర ఉంటుందన్నారు. యాత్ర సమయంలో ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (వెజిటేరియన్) అందించనున్నట్లు తెలిపారు. సికింద్రబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు–రేణిగుంట మీదుగా యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతీ భోగీలో రైల్వే తరఫున ఎస్కార్ట్స్, ఆయా క్షేత్రాల్లో భక్తులను దగ్గర ఉండి తీసుకువెళ్లడం, తిరిగి రైలుకు చేర్చడం, సమయానికి ఆహారం, మంచినీరు, టాయ్లెట్ల పరిశుభ్రత, రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు, లగేజీ భద్రత, ప్రయాణ బీమా ఉంటుంది.
59
You Might Also Like
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
2
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
21
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...
భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్
(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్ భగత్సింగ్. కిషన్సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్...
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం
28
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు...
తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!
-డాక్టర్ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి...
ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్పి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి...