News

దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన… సోషల్ మీడియా లో ‘ట్రిపుల్ తలాక్’…!

57views

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సోషల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దంపతులకు బిడ్డ పుట్టి రెండు నెలలే అవుతోంది.

తన భర్త ఇతరుల సహచర్యం కోరుకున్నందున విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. . ‘ఐ డైవర్స్‌ యూ’. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య’’ అని షైకా మహ్రా ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కావడంతో పాటు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేశఆరు. షైకా మహ్రా అకౌంట్ హ్యాక్‌ అయ్యిందనే చర్చ కూడా జరుగుతోంది.

దుబాయ్‌ పాలకుడు, యూఏఈ పీఎం షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కుమార్తె షేక్‌ మెహ్రా. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో ను గత ఏడాది మే 27న వివాహామాడారు.