News

బస్సులో హిందూ మైనర్ బాలికను వేధించిన మౌల్వీ.. దాడి చేసి బుద్ది చెప్పిన ప్రయాణికులు

46views

బస్సులో తన పక్కన కూర్చున్న ఓ మైనర్‌ బాలికను మౌల్వీ వేధించాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆయనపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పారు. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సులో ఓ మౌల్వీ ఈ వెకిలి వేషాలకి దిగాడు . ఈ నెల 13 న ఈ ఉదంతం జరిగింది. సోషల్ మీడియాలో కూడి ఇది వైరల్‌ అయ్యింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్లే బస్సులో ఓ మౌల్వీ మైనర్‌ హిందూ బాలికను వేధించాడని, వెంటనే తోటి ప్రయాణికులు అతనిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఛండాలపు చర్యను నెటిజన్స్‌ అందరూ తీవ్రంగా ఖండించారు.

బాలిక కూర్చున్న సీటు కింద చేయి పెట్టి.. పలు మార్లు వేధించాడు. ఈ విషయాన్ని ఆ హిందూ బాలిక వెంటనే తన తల్లికి చెప్పింది. కాస్త వేచి చూసే ధోరణిలో వున్న తల్లి.. కాస్త ఆగగా… ఆ మౌల్వీ మళ్లీ అదే వెకిలి చేష్ఠలు చేశాడు. దీంతో బాలిక తల్లి మౌల్వీతో గొడవకు దిగింది. ప్రయాణికులు కూడా బుద్ధి చెప్పడంతో మౌల్వీ చివరికి తాను చేసింది తప్పేనని అంగీకరించాడు. తనను క్షమించాలని వేడుకొన్నాడు. అయినా సరే.. ప్రయాణికులు దాడి చేస్తూనే వున్నారు. మౌల్వీపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.