59
వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టైం స్లాటేడ్ దర్శన్ ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ ఆదివారం కొనసాగింది. ఉచిత సర్వదర్శనంకోసం క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆపై రింగ్రోడ్డులోని శ్రీవారి సేవా సదన్ వరకూ భక్తులు క్యూ లైన్ వేచి ఉన్నారు. వీరికి స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతోందని టిటిడి ప్రకటించింది.