60
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంత భద్రతను అంచనా వేయడమే లక్ష్యంగా రెండు రోజులపాటు సాగర్కవచ్ నిర్వహించారు. ఈ వ్యాయామంలో ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, సీఐఎస్ఎఫ్, కస్టమ్స్, ఆర్పీఎఫ్, స్టేట్ పోలీస్, మైరెన్ పోలీస్, ఫిషరీస్, ఐబీ, పోర్ట్ అథారిటీస్ వంటి స్టేట్ ఏజెన్సీలు చురుగ్గా పాల్గొన్నాయి. తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలోని నేవల్, కోస్ట్గార్డ్ వైమానిక ఆస్తులు కాపడడమే ధ్యేయంగా వైమానిక నిఘా నిర్వహించిన ఈ వ్యాయామంలో భారత నౌకాదళ నౌకలు, కోస్ట్గార్డ్ నౌకలు పాల్గొని విన్యాసాలు ప్రదర్శించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.