సర్వ జీవరాశుల్లో మనిషికి మాత్రమే విచక్షణాశక్తి ఉంది. మన ఆలోచనలు నీతి, నిజాయతీ దిశగా సాగితే దేవుడికి చేరువవుతాం. మన జన్మ పరులకు ఉపకారం చేసేందుకేనని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఎదుటివారికి మేలు చేస్తే వచ్చే ఆనందం స్వర్గవాసం కన్నా మిన్న. మంచి ఆలోచనలే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆనందానికి మూల కారణమవుతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు. మంచిగా ఆలోచిస్తే మేలు, చెడు తలపులతో కీడు కలుగుతాయి. నిరంతరం నిస్వార్థంగా ఆలోచిస్తే పరులకు సాయపడాలనే దృఢ సంకల్పం మనసులో నిండుతుంది. సర్వ ప్రాణులూ సుఖంగా ఉండాలనే భావన మనసులో మెదులుతుంది. ఆధ్యాత్మిక చింతనతో విశాల దృక్పథం అలవడుతుంది. నిస్వార్థంగా, నిర్మల చిత్తంతో చేసే ప్రతి పనీ దైవికమే. ఇతరుల శ్రేయస్సు గురించి మనం ఆలోచిస్తే, మన మేలును దైవం చూసుకుంటుంది. మన చేష్టలు ఇతరులకు ఆవేదన కలిగించకూడదు. మహానుభావులెందరో అందరికోసం తమ జ్ఞానాన్ని పంచారు. వారు లేకపోయినా ఆ జ్ఞానం సమాజానికి ఉపయోగపడుతుంది. ‘పరుల కోసం పాటుపడని నరుడి బతుకు దేనికి’ అనే సినారె గీతం కూడా ఇదే చెబుతుంది.
67
You Might Also Like
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
2
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
10
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
13
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
18
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
28
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
25
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....