ArticlesNews

హిందువులను నీచంగా దూషించిన చర్చి పాస్టర్

211views

తమిళనాడులోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ హిందువులను తీవ్రంగా అవమానిస్తూ రెచ్చిపోయారు. హిందూ ధర్మంలోని అగ్రవర్ణాల వారు వారు గోమూత్రం తాగుతున్నారని, ఆవు పేడ తింటున్నారంటూ అవమానకరంగా ఆ పాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 16, ఆదివారం రోజున సీఎస్ఐ ఇమ్మాన్యుయేల్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో హిందూ ఆచారాలను, విశ్వాసాలను లక్ష్యంగా చేసుకొని, వాటిని అవమానపరుస్తూ ఆ పాస్టర్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. హిందువుల్లోని ఏ వర్గం వారు ఇలా చేస్తారో మాత్రం ఆ పాస్టర్ చెప్పకుండా.. గోమూత్రం తాగుతారని, గోమయం (ఆవుపేడ) తింటారంటూ పేర్కొన్నాడు. ముస్లింలు, క్రైస్తవుల పాలనలో హిందువులు ఇలా అత్యంత అసహ్యకరమైన పద్ధతులను అవలంబించారంటూ రెచ్చిపోయారు. అయితే, ముఖ్యంగా ఇదంతా బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకొని ఆ పాస్టర్ రెచ్చిపోయినట్లు అర్థమవుతుంది .

‘‘నేడు ఇద్దరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. అబ్రహము మతస్థులు ఒకరైతే.. ఇస్మాయేలు వారసులు మరొకరు. క్రిస్టియన్లు మరియు ముస్లింలు. కానీ.. ఇక్కడి ప్రజలు మాత్రం ఎప్పుడూ సనాతన ధర్మం, ఆధ్యాత్మికత గురించే మాట్లాడతారు. వారు కుడుములు, కొబ్బరి తింటారు. అలాగే గోమూత్రం తాగుతారు. ఆవుపేడ (గోమయం) తింటారు. ఇందులో ఆధ్యాత్మికత ఏముందో? గోమాంసం తినేవారిని కింది వర్గాలంటారు. గోమూత్రం తాగేవారిని అగ్రవర్ణాలవారు అని అంటారు. వారికి మెదడుందా? ఆవు పేడను తినేవారు (యజ్ఞోపవీతం ధరించేవారు) అగ్రవర్ణాలనీ, అదే ఆవు పేడను తినేవారిని కింది వర్గాలని అంటున్నారు. పేడ తినే జాతి ఇక్కడే నివసిస్తుంది. ప్రపంచంలో ఏ జాతి కూడా పేడ తినదు. భారత్‌లో మాత్రమే పేడతిని, మూత్రం తాగుతారు. భారత్‌లో అలాంటి అసహ్యకరమైన జాతి వుంది. ఈ జాతే తాము బ్రహ్మ దేవుడి తల నుంచి వచ్చామని చెప్పుకుంటారు. బ్రహ్మ తల నుంచి పుడితే నేలమీద పడేదానిని ఎందుకు తింటారు? మనమందరమూ ఆవు ముందు నిలుచుంటే.. వీరు మాత్రం వెనుక భాగంలో నిల్చోని, ఆవు తోక ఎప్పుడు ఎత్తుందా? అంటూ వేచి చూస్తారు. ఇలా చేసినవారే మనల్ని క్రూరులు, అనాగరిక ప్రజలని నిందిస్తారు. అంతేకాకుండా మనల్ని అంటరానివారని పిలుస్తుంటారు. వారందరూ చాలా నీచపు పనులు చేస్తుంటారు.’’ అంటూ హిందువులను తీవ్రంగా అవమానపరుస్తూ ప్రసంగించాడు.

అలాగే కొన్ని ప్రాంతాలలో నీటిని తోడుకోవడంలోనూ వివక్ష చూపిస్తుంటారని, నీటి వనరుల విషయంలోనూ తీవ్రమైన వివక్షను చూపిస్తున్నారని, ప్రజలను విభజిస్తున్నారంటూ ఆ పాస్టర్ పేర్కొన్నారు. హిందువులను, బ్రాహ్మణులను ఆ పాస్టర్ ఇంతలా అవమానపరచడంపై స్థానిక హిందువులు, విశ్వహిందూ పరిషత్ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే హిందూ వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ… ఇలా అవమానపరుస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇంత నీచంగా మాట్లాడిన పాస్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.