ArticlesNews

వివాహం అంటేనే విశిష్టమైనది

123views

వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందిం చారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్టాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసా మాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం చేసారు.

వివాహం ఎంత గొప్పది! వివాహం అంటేనే విశిష్టమైనది- అని. దానిని మనకు సంప్రాప్తింప చేయడానికి జరిపే సంస్కారమే వివాహం. వివాహం అంటే విశిష్టమైనదానిని పొందుట. మరి ఆ విశిష్టమైనదేది? అదే మోక్షం. దీనిని పొందడానికి యోగ్యమైనది ధర్మాను స్థానం. అది సక్రమంగా జరగ కుండా దానికి అడ్డుపడుతున్నవి ఏవి? రాగద్వేషా లయి పాపపుణ్యాలకు, పునర్జన్మలకు కారణమవుతాయి. అలాకా కుండా ర్మబద్ధం చేసి పాశాలు విడిపోవడానికి సంసార ప్రవేశం జరగాలి. అసలు పెద్దవాళ్ళనే వాళ్ళు పెళ్ళికూతురిని, పెళ్లికొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడారో పరిశీలించు. పెద్దరికం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే సంసారంలో ఎప్పటికప్పుడు ఎదు రయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో రుషులు దేశకాలాలతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో సర్వజనులకు ఉపయోగపడే విధంగా వాటిని అందించారు.

నిత్యజీవితంలో మనిషి మనిషిగా ఉండడానికి కావలసిన మానవత్వాన్ని నిలబెట్టడం చాలా అవసరం. అలా అది నిలబడాలంటే… రామాయణం, భారతం తదితర గ్రంథాలను బాగా పరిశీలించాలి. అవి నిత్యపారాయణకు యోగ్యత ఉన్న గ్రంథాలు. వాటిని కనీసం రోజుకో అధ్యాయం చొప్పున అయినా చదువు కుంటూ ఉండాలి. దానివల్ల ధార్మిక జీవనం అలవడడమే గాక, మనుషుల్లో మానవత్వం మిగులుతుంది. అది లేనప్పుడు మీరు సమకూర్చుకున్న జ్ఞానం, ప్రతిభాపాటవాలు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు.