పంజాబ్లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్ అంశం తెరపైకి వచ్చింది. అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్ బ్లూస్టార్కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. హత్యకు గురైన తీవ్రవాదులు జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే, హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలను ప్రదర్శించారు. స్వర్ణదేవాలయంలోని అకాల్ తఖ్త్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రదర్శనకారుల నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ ఎంపీ ధియాన్ సింగ్ మంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనకారులను ఉద్దేశించి అకాల్ తఖ్త్ అధినేత జ్ఞానీ రఘువీర్ సింగ్ ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రులుగా పంజాబ్ నుంచి గెలిచిన అమృత్పాల్ సింగ్, సరబ్జీత్ సింగ్.. చాలా కాలంగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీల విడుదలకు పార్లమెంటులో తమ గళం వినిపించాలని ఆయన కోరారు.
101
You Might Also Like
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
48
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
39
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...