తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకు దాదాపు కిలోమీటరు మేర వ్యాపించింది. వీరికి 20 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. గురువారం రాత్రి ఆలయంలో పూలంగిసేవ కూడా ఉన్న నేపథ్యంలో లైన్ దాదాపు రెండు గంటల పాటు ముందుకు కదల్లేదు. దీంతో క్యూలైన్లోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు భక్తులు క్యూలైన్లో ఉండలేక తిరిగి వెళ్లారు. మరికొందరు క్యూలైన్లలో కూర్చున్నారు. శుక్రవారం వేకువజాము ఆర్జితసేవలు, ఉదయం అభిషేకం, వీఐపీ బ్రేక్ ఉన్న క్రమంలో వీరికి దర్శనం ఆలస్యమయ్యే అవకాశముంది. కొన్ని ప్రదేశాల్లో శ్రీవారిసేవకులు క్యూలైన్లో భక్తులకు తాగునీరు అందిస్తూ కనిపించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సేవకులు లేకపోవడంతో భక్తులే భక్తులకు తాగునీరు, ఆహారం అందిస్తూ కనిపించారు. మరోవైపు శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాదకేంద్రం, బస్టాండ్, లేపాక్షి సర్కెల్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
1.7k
You Might Also Like
ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!
49
మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు....
లవ్ జిహాద్తో దేశ ఐక్యతకు ముప్పు
29
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు...
తిరుమల గొడుగుల ఊరేగింపు
34
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ...
ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం
31
ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్...
కోల్కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
32
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు...
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
39
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి...