రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డా. పి.వి.బి సంజీవ రావు తదితర నగర ప్రముఖులు రాజమహేంద్రవరం ఆనంద గార్డెన్స్ వద్ద కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .
71
You Might Also Like
13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
31
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి...
పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
20
పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు...
సర్జికల్ స్ట్రైక్: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016,...
తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…
23
శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది....
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
28
రాజస్థాన్లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత...
సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..
27
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా బంగారు...