News

శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం…సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ

62views

ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగి పోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీమల సిఫారుసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నారు.

◆ శ్రీవారి సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది. ◆అలిపిరి నడకదారి సమీపంలో ఆఖరి మెట్ల వద్ద సోమవారం రెండు చిరుతలు సంచరిస్తుండగా భక్తులు వాటిని చూసి కేకలు వేశారు. దీంతో అవి అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.