
141views
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను అలహాబాద్ హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు వ్యవహారాలను చూసే ‘అంజుమాన్ ఇంతెజామియా మసీదు కమిటీ’ దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ రోహిత్రంజన్ అగర్వాల్ సోమవారం విచారణ జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. దావా వేసిన వ్యక్తికి వివాదాస్పద ఆస్తిపై ఎలాంటి హక్కు ఉందో ఇంకా నిర్ణయించాల్సి ఉందని, ఆ హక్కు తేలకుండానే పూజల్ని అనుమతించడం అక్రమమని ముస్లింల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆయన అభ్యర్థన మేరకు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.