వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఇవి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20న భైరవ్నాథ్ పూజలు చేయడంతో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున ఉభీమర్ లోని ఓంకారేశ్వర్నాథ్ మందిరం నుంచి కేదార్నాథ్ స్వామి పల్లకీ బయలుదేరుతుంది. రాత్రికి గుప్తకాశీలోని విశ్వనాథ్ మందిరంలో బసచేస్తారు. 22న పాఠ, 23న గౌరీకుండ్లకు వెళ్తుంది. 24న కేదర్నాథ్ పల్లకీ చేరుకుంటుంది. ఏప్రిల్ 25న ఉదయం 6.20 గంటలకు కేదర్నాథ్ ఆలయం తెరుచుకుంటుంది. అక్షయ తృతీయ అయిన ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. బద్రీనాథ్కు ముఖ ద్వారంగా భావించే జోషీమఠ్లో ఇటీవల కొండచరియలు కూలి ఇళ్లకు పగుళ్లు ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టీ ఈ యాత్ర నిర్వహణపై పడింది. అయితే.. జోషీమఠ్ ప్రభావం ఈ యాత్రపై ఉండబోదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ చెప్పారు. గత ఏడాది 45 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి అంత కన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
127
You Might Also Like
ఏప్రిల్ 4 నుంచి అన్నమయ్య వర్ధంతి వేడుకలు
14
తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి వేడుకలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108...
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
18
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)...
సింహగిరిపై ఆధ్యాత్మిక కాంతులు
32
సింహాచలం బుధవారం సుదర్శన నారసింహ మహాయజ్ఞం శోభను సంతరించుకుంది. ఎటు చూసినా యజ్ఞకాంతులతో ప్రజ్వరిల్లింది. లోకకల్యాణార్థం ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంను...
స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 47 ; గుండ్లపల్లి ఆదినారాయణ పంతులు
స్వాతంత్ర పోరాటంలో ఒంగోలు తాలూకా ముందు నిలిచింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారిలో గుండ్లపల్లి ఆదినారాయణ గారు ప్రథములు. సుశిక్షితుడైన సేనానిగా స్వాతంత్ర...
కాకినాడ తీరంలో రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు
40
సముద్ర మార్గం నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే శత్రు సైన్యం, ఉగ్రవాదులను కట్టడి చేసే లక్ష్యంగా మనదేశ రక్షణ దళాలు, అమెరికా రక్షణ దళాల సంయుక్త...
సత్యదేవునికి బంగారు ధ్వజస్తంభం
41
అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయంలో నూతన బంగారు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం తొలగింపు పనులకు...