
72views
ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు కింద రోజూ వెయ్యి టికెట్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 750 టికెట్లు ఆన్లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్లో ఉంటాయి. ఆన్లైన్ కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్లో ఉంచనున్నారు.