
72views
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోగా ఇంకా కొంత మంది పారిపోయినట్టు సమాచారం. పారిపోయిన మావోయిస్టుల కొసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.