News

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

318views

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు చేసిన డ్రగ్స్​ను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు.

డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని పాలక్కడ్​కు చెందిన మురళీధరన్ నాయర్​గా అధికారులు గుర్తించారు. అతడు జింబాబ్వే నుంచి దోహా మీదగా ఢిల్లీ వచ్చాడు. అక్కడి నుంచి ఎయిర్ ఏషియా విమానంలో కొచ్చి విమానాశ్రయానికి రాగా.. అక్కడి సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో అతడి బ్యాగ్​లో ఉన్న 30 కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. అధునాతన త్రీడీ ఎమ్​ఆర్​ఐ స్కానింగ్ యంత్రం ఉపయోగించి డ్రగ్స్​ను గుర్తించారు కొచ్చి విమానాశ్రయ అధికారులు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి