News

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు

211views
  • ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ

ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్‌ రోడ్లపైకి రానున్నాయ‌ని, తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించార‌న్నారు. ముంబైలోని బృహన్‌ ముంబాయ్‌ ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్టు స్విచ్‌ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్‌ గన్‌ చార్జింగ్‌ సిస్టమ్‌ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి