
299views
భోపాల్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టెక్నికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంకా భయ్యాజీ జోషి బిల్వ వృక్షపు మొక్కను, విశ్వహిందూ పరిషత్ మహామంత్రి మిలింద్ పరాండే అశ్వత్థ వృక్షపు మొక్కను, దినేష్ చంద్ర పారిజాతపు మొక్కను నాటిని, నీరు పోశారు.






