News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

404views

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిల్​బాగ్​.. ఈ వ్యాఖ్యలు చేశారు.

జాజర్​ కొట్లీలో పట్టుబడ్డ 52 కిలోల‌ హెరాయిన్, పూంచ్​, బారాముల్లా, కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్​ కలకలం సృష్టించాయి. ఈ ఘటనలను ఉద్దేశిస్తూ దిల్​బాగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు ఫలించేందుకు పాక్​ స్థానిక యువతను బలిచేస్తోందని దిల్​బాగ్​ పేర్కొన్నారు. డ్రగ్స్​ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి