
366views
-
ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు
జమ్మూకశ్మీర్: ఈ నెల 25న కశ్మీర్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అక్కడి యంత్రాంగం నిలిపివేసింది. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. సాధారణ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగమేనని స్పష్టం చేశారు.