News

మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వ సాయం కావాలి : కృష్ణపట్నం ఆనందయ్య

438views

నాటు మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు శ్రీ కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతూ ఆనందయ్య సీఎంకు ఇటీవల లేఖ వ్రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం ప్రకటించలేదని బుధవారం ఆయన తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం స్పందించకుంటే తన తదుపరి కార్యాచరణను తాను ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు మందును ఎలా పంపాలనే విషయాన్ని తమ బృందంతో గురువారం చర్చిస్తానన్నారు. ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామని, తమ గ్రామంలో అందరికీ ఇప్పటికే పంపిణీ చేశామని, సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతోందని తెలిపారు. 50 వేల మంది కరోనా పాజిటివ్‌ బాధితులకు ఇచ్చేందుకు తగినంత మందు తమవద్ద సిద్ధంగా ఉన్నదని ఆనందయ్య తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.